Pawan Kalyan Kakinada: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ 'మాట-మంతి'- పొల్యూషన్ ఆడిట్కు ఆదేశాలు -100 రోజుల్లో పరిష్కార హామీ
Pawan Uppada: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై పవన్ సమీక్ష చేశారు. వందరోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పొల్యూషన్ ఆడిట్కు ఆదేశించారు.

Uppada fishermen problems Kakinada: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో 'మాట-మంతి' కార్యక్రమం నిర్వహించారు. సముద్ర కాలుష్యం, తీర కోత, మత్స్యకారుల ఇబ్బందులు వంటి కీలక సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. వేటకు వెళ్లి మృతి చెందిన 18 మత్స్యకారుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రకాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. 100 రోజుల్లో సమస్యల పరిష్కారానికి మత్స్యకారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మత్స్యకారుల ప్రతినిధులు సముద్రంలో కలిసే పారిశ్రామిక వ్యర్థాల వల్ల చేపలు మరణిస్తున్నాయని, తమ జీవనోపాధి ప్రభావితమవుతోందని తెలిపారు. తీర కోత, మత్స్య సంబంధిత సహాయాలు, బీమా వ్యవస్థలలో లోపాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మత్స్యకారుల ప్రతి సమస్యను శ్రద్ధగా విని, అధికారులతో నోట్ చేయించారు. "మీ సమస్యలు మా ప్రాధాన్యత. పరిశ్రమలు, మత్స్య శాఖ, పీసీబీ, ఎన్జీవోలు, మత్స్యకారులు అందరినీ భాగస్వాములను చేసి, 100 రోజుల్లో పరిష్కార మార్గాలు సూచిస్తాం" అని భరోసా ఇచ్చారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చేపట్టిన ఉప్పాడ మత్స్యకారులతో మాట... మంతి కార్యక్రమం ముగిసింది
— JanaSena Party (@JanaSenaParty) October 9, 2025
ఈ కార్యక్రమంలో భాగంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు అందించారు. 18 కుటుంబాలకి రూ. 5 లక్షల చొప్పున బీమా సాయం… pic.twitter.com/UIF4bLlDna
పీసీబీ అధికారులు పారిశ్రామిక కాలుష్యంపై వెంటనే ఆడిట్ చేపట్టి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వేటకు వెళ్లి మరణించిన 18 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు.
పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ మరియు సమీప ప్రాంతాల సాగర తీరంలో పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉప్పాడ ప్రజల మాటా - మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పాల్గొన్నారు. ఈ సమావేశంలో… pic.twitter.com/sACZ2pranK
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 9, 2025
ఉప్పాడ తీరప్రాంతంలో పారిశ్రామిక ప్రదేశాల వల్ల సముద్ర నీటి కలుష్యం పెరిగింది. చేపలు మరణించడం, మత్స్యకారుల ఆదాయం తగ్గడం వంటి సమస్యలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కాకినాడకు చేరుకుని, భారీ బందోబస్తు మధ్య సమావేశం జరిగింది. కలెక్టరేట్ సమావేశం ముగిసిన తర్వాత, మత్స్యకారులు, స్థానిక నాయకులతో మరిన్ని చర్చలు జరిగాయి.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















