అన్వేషించండి

Palnadu News : గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది బాలికలకు అస్వస్థత!

Palnadu News : పల్నాడు జిల్లా రామకృష్ణపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

Palnadu News :పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు.  దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

జవహర్ నవోదయ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. వయనాడ్‌ జిల్లాలోని లక్కిడి ప్రాంతంలో గల జవహర్‌ నవోదయ విద్యాలయంలో సుమారు 486 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ లో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడడంతో  పాఠశాల సిబ్బంది వారిని చికిత్స కోసం  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌ అవ్వడానికి కారణాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

హైస్కూల్ ఫుడ్ పాయిజన్, 36 మంది విద్యార్థులకు అస్వస్థత 

 మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హైస్కూల్లో 5,7వ తరగతుల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం సెంట్రల్‌ కిచెన్‌లో అన్నం, ప‌ప్పు కూర‌తో భోజనం చేసిన త‌రువాత అస్వస్థత‌కు గురయ్యారు. మొత్తం 36 మంది విద్యార్థులు అస్వస్థత‌కు గురి కాగా వెంట‌నే వారిని స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించారు. వీరిలో 35 మంది విద్యార్థులను చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఒక విద్యార్థిని మాత్రం అబ్జర్వేష‌న్‌లో ఉంచి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఆ విద్యార్థి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌నపై విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ వాన్‌లెస్‌వాడి ఉన్నతపాఠశాల మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సెంట్రల్ కిచెన్ నుంచి సేక‌రించిన‌ ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు.  ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ కోసం ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీని వేసినట్లు తెలిపారు.

 బిర్యానీ తిని యువతి మృతి 

కేరళలో  20 ఏళ్ల యువతి ఇటీవల బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో ఫేమస్ వంటకం అయిన "కుజిమంతి" బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న యువతి...అది తిన్న వెంటనే అనారోగ్యానికి గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అంజు శ్రీపార్వతి అనే యువతి కసరగాడ్‌లో ఉంటోంది. గతేడాది డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంది. అది తిన్నాక అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి..చివరకు మృతి చెందింది.  "తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ ఉదయం బాధితురాలు చనిపోయింది" అని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మొదట వైద్యం అందించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు చనిపోయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget