అన్వేషించండి

టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆనం- రాష్ట్రంలో మార్పు మొదలైందని కామెంట్

తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది.

Nellore Politics: తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరేందుకు ఆయన ఓకే చెప్పేశారు. 

తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరేందుకు ఆయన ఓకే చెప్పేశారు. 
మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. శుక్రవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమైనట్టు చెప్పారు. అన్ని విషయాలు చర్చించామని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కూడా మాట్లాడుకున్నామని వివరించారు. 

ఈ ఉదయం నుంచి నెల్లూరు జిల్లాలో కీలక పరిణామాలు జరిగాయి. ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చెప్పిన సందేశాన్ని వారికి వినిపించారు. దీనిపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. అనంతరం టీడీపీలో చేరుతున్నట్టు అనం ప్రకటించారు. 

మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతారని ఆ పార్టీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసిపి ప్రభుత్వానికి చుక్కలు చూపే మార్పు నెల్లూరులోనే మొదలైంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా పాదయాత్రలో పాల్గొంటారని సోమిరెడ్డి ప్రకటించారు. 

ఈనెల 13న నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ కానున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర పది నియోజకవర్గాల్లో సాగనుంది. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరులో వస్తున్న మార్పు ఒక్క ఆ జిల్లాకే పరిమితం కాదని రాష్ట్రంలోనే వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

చాలా రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారని ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అంతక ముందు నుంచే వీళ్లంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అవకాశం కోసం చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని వారిపై వేటు వేసింది. వైసీపీ అధినాయకత్వంపై వీళ్లంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని కూడా విమర్సలు చేశారు. 

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నెల్లూరు రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రామనారాయణ రెడ్డి విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. అయితే అక్కడ ప్రాధాన్యత లభించలేదని వైసీపీలో చేరారు. వైసీపీ టికెట్‌పై పోటీ చేసి 2019లో విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ కూడా ప్రాధాన్యత లేదని మళ్లీ సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget