అన్వేషించండి

Nellore News : గ్రేస్ మార్కులు వద్దు, కష్టపడి చదువుతామంటున్న పదో తరగతి విద్యార్థులు

ఏపీలో ప్రతిపక్షాలు టెన్త్ పిల్లలకు గ్రేస్ మార్కులు ఇవ్వండి, పాస్ చేయండి.. అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. అయితే ఫెయిలైన పిల్లల్లో కొంతమంది తమకు గ్రేస్ మార్కులు వద్దంటున్నారు.

ఇటీవల ఏపీలో ప్రతిపక్షాలు టెన్త్ పిల్లలకు గ్రేస్ మార్కులు ఇవ్వండి, పాస్ చేయండి.. అంటూ డిమాండ్ చేశాయి.అయితే ఫెయిలైన పిల్లల్లో కొంతమంది తమకు గ్రేస్ మార్కులు వద్దంటున్నారు. ప్రభుత్వం ఎలాగూ సప్లిమెంటరీ పరీక్షలు పెడుతోంది. అందులో పాస్ అయితే కంపార్ట్ మెంటల్ అని కాకుండా గ్రేడ్లు ఇస్తామంటోంది. ఇంకేంటి అభ్యంతరం. అందుకే తాము సప్లిమెంటరీ రాసి కచ్చితంగా పాస్ అవుతామంటున్నారు విద్యార్థులు. గ్రేస్ మార్కులు అవసరం లేదని చెబుతున్నారు. 

గతంలో ఎప్పుడూ లేనట్టుగా టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజీ పడిపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వమే ఫెయిలైన విద్యార్థులకోసం స్పెషల్ క్లాస్ లు నడుపుతోంది. ఈరోజు నుంచి ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో రెమెడియల్ క్లాస్ ల పేరుతో ఫెయిలైన విద్యార్థులకు క్లాస్ లు మొదలు పెట్టారు టీచర్లు. రాష్ట్రవ్యాప్తంగా 13వ తేదీ మొదలైన రెమెడియల్ క్లాస్ లు వచ్చే నెల పరీక్షలు మొదలయ్యే వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే డీఈవో కార్యాలయాల నుంచి టైమ్ టేబుల్ విడుదలైంది. ప్రతి రోజూ ఆయా సబ్జెక్ట్ ల టీచర్లు పిల్లలతో సిలబస్ రివిజన్ చేయిస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో కచ్చితంగా విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేయిస్తామని చెబుతున్నారు టీచర్లు.

Nellore News : గ్రేస్ మార్కులు వద్దు, కష్టపడి చదువుతామంటున్న పదో తరగతి విద్యార్థులు

విద్యార్థులు సైతం ఉత్సాహంగా ఈ రెమెడియల్ క్లాస్ లకు హాజరవుతున్నారు. తొలిరోజు స్పందన కాస్త తక్కువగా ఉన్నా.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి క్లాస్ లకు వచ్చేలా చేస్తున్నారు ఉపాధ్యాయులు. అయితే విద్యార్థులు మాత్రం ఒకటీ రెండు మార్క్ లు తక్కువయినా తమకు గ్రేస్ మార్క్ లేవీ వద్దని కష్టపడి చదివి సప్లిమెంటరీలో పాసవుతామని చెబుతున్నారు. ఒక్క మార్క్ తో ఫెయిలైన వారు కూడా తమకు గ్రేస్ మార్క్ లు వద్దని రీకౌంటింగ్  కూడా వద్దంటున్నారు. 

పదో తరగతి ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 13 నుంచి ఆయా స్కూళ్లలో ప్రత్యేత తరగతులు జరుగుతున్నా. రోజుకి రెండు సబ్జెక్ట్ లపై బోధన ఉంటుంది. ఆయా సబ్జెక్టులలో ఫెయిలైన విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. డీఈవోలు సమీక్ష నిర్వహించాలని 13వతేదీ నుంచి టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు. 

6,15,908మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరు కాగా.. 2,01,627మంది ఫెయిలయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం స్పెషల్ క్లాస్ లు మొదలయ్యాయి. ఫెయిలైన విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యే బాధ్యతను హెడ్ మాస్టర్లకు అప్పగించారు. గూగుల్ ఫామ్ ద్వారా రోజువారీ అటెండెన్స్ పై కూడా నివేదికలు ఇస్తున్నారు. రెమిడియల్ తరగతులు ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget