అన్వేషించండి

Andhra News: అడవి పందుల దాడితో జలాశయంలోకి దూకిన ఆవుల మంద, 50 గల్లంతు!

Andhra News: అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. చాకచక్యంగా వ్యవహరించిన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి.

Andhra News:  అడవి పందులను చూసి బెదిరిపోయిన వందలాది ఆవులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటు చేసుకుంది. వాటిలో 400 ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటిలు.. గ్రామానికి చెందిన పలువురి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. 

ఆవుల మందపై ఆధారపడి జీవిస్తున్న పశువుల కాపర్లు..

అయితే చాలా మంది వీరికి తమ ఆవులను మేపమని చెప్పి నెలక కొంత మొత్తంలో డబ్బు ఇస్తుంటారు. అలా మొత్తం వెయ్యి ఆవులను మేపుతూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లాగానే ఆవుల యజమానులు ఆవులను మందలోకి పంపి ఇళ్లకు వెళ్లిపోయారు. మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాల లింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబ కోటిలు పశువులను మేత కోసం.. గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కన ఉన్న మైదాన ప్రాతానికి తీసుకువచ్చారు. అక్కడే ఆవుల మందను నిలపగా.. అవి గడ్డి తింటూ అక్కడక్కడే తిరిగాయి.

పందుల గుంపు రావండోతనే ఆవులు ఆగమాగం..

ఇలా ఓ రెండు మూడు గంటలు గడిచే సరికి... అటు వైపు నుంచి ఓ పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. వాటని గమనించిన ఆవులు తీవ్రంగా భయపడిపోయాయి. వెయ్యి ఆవుల మంద అటూ, ఇటూ పరిగెత్తడం ప్రారంభించాయి. పశువుల కాపర్లు విషయం అర్థం చేసుకునే లోపే 500 ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీశాయి. వీటి వెనుకే పశువుల కాపర్లు కూడా పరిగెత్తారు. కానీ వాళ్లు కట్టపైకి చేరేలోపే 450 ఆవులు జలాశయంలోకి దూకేశాయి. అది చూసిన పశువుల కాపర్లు.. వెంటనే విషయాన్ని యజమానులకు, స్థానిక ప్రజలు తెలియజేశారు. 

సురక్షితంగా ఒడ్డుకు చేరిన 400 ఆవులు..

హుటాహుటిన గ్రామస్థులు, ఆవుల యజమానులు జలాశయం వద్దకు చేరుకున్నారు. మత్స్యకారులకు కూడా సమాచారం అందడంతో.. నాటు పడవలు, పుట్టిలతో రంగంలోకి దిగారు. యజమానులంతా ఆ నాటు పడవలు, పుట్టిల్లో జలాశయంలోకి వెళ్లి ఆవులను కాపాడే ప్రయత్నం చేశారు. అలా చాలా మంది కలిసి మొత్తం 400 ఆవులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. ఇప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. అయితే స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థాలానికి వచ్చారు.

కన్నీరుమున్నీరవుతున్న ఆవుల యజమానులు.. 

సీఐ, ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద ఘటనలో యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఆవులు సురక్షితంగా ఒడ్డున పడ్డ వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ... గల్లంతైన ఆవుల యజమానులు మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు. వాటిపైనై ఆధారపడి జీవిస్తున్న తమ జీవితాలు ఏమైపోతానంటూ కుమిలిపోతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget