అన్వేషించండి

Andhra News: అడవి పందుల దాడితో జలాశయంలోకి దూకిన ఆవుల మంద, 50 గల్లంతు!

Andhra News: అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. చాకచక్యంగా వ్యవహరించిన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి.

Andhra News:  అడవి పందులను చూసి బెదిరిపోయిన వందలాది ఆవులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటు చేసుకుంది. వాటిలో 400 ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటిలు.. గ్రామానికి చెందిన పలువురి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. 

ఆవుల మందపై ఆధారపడి జీవిస్తున్న పశువుల కాపర్లు..

అయితే చాలా మంది వీరికి తమ ఆవులను మేపమని చెప్పి నెలక కొంత మొత్తంలో డబ్బు ఇస్తుంటారు. అలా మొత్తం వెయ్యి ఆవులను మేపుతూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లాగానే ఆవుల యజమానులు ఆవులను మందలోకి పంపి ఇళ్లకు వెళ్లిపోయారు. మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాల లింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబ కోటిలు పశువులను మేత కోసం.. గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కన ఉన్న మైదాన ప్రాతానికి తీసుకువచ్చారు. అక్కడే ఆవుల మందను నిలపగా.. అవి గడ్డి తింటూ అక్కడక్కడే తిరిగాయి.

పందుల గుంపు రావండోతనే ఆవులు ఆగమాగం..

ఇలా ఓ రెండు మూడు గంటలు గడిచే సరికి... అటు వైపు నుంచి ఓ పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. వాటని గమనించిన ఆవులు తీవ్రంగా భయపడిపోయాయి. వెయ్యి ఆవుల మంద అటూ, ఇటూ పరిగెత్తడం ప్రారంభించాయి. పశువుల కాపర్లు విషయం అర్థం చేసుకునే లోపే 500 ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీశాయి. వీటి వెనుకే పశువుల కాపర్లు కూడా పరిగెత్తారు. కానీ వాళ్లు కట్టపైకి చేరేలోపే 450 ఆవులు జలాశయంలోకి దూకేశాయి. అది చూసిన పశువుల కాపర్లు.. వెంటనే విషయాన్ని యజమానులకు, స్థానిక ప్రజలు తెలియజేశారు. 

సురక్షితంగా ఒడ్డుకు చేరిన 400 ఆవులు..

హుటాహుటిన గ్రామస్థులు, ఆవుల యజమానులు జలాశయం వద్దకు చేరుకున్నారు. మత్స్యకారులకు కూడా సమాచారం అందడంతో.. నాటు పడవలు, పుట్టిలతో రంగంలోకి దిగారు. యజమానులంతా ఆ నాటు పడవలు, పుట్టిల్లో జలాశయంలోకి వెళ్లి ఆవులను కాపాడే ప్రయత్నం చేశారు. అలా చాలా మంది కలిసి మొత్తం 400 ఆవులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. ఇప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. అయితే స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థాలానికి వచ్చారు.

కన్నీరుమున్నీరవుతున్న ఆవుల యజమానులు.. 

సీఐ, ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద ఘటనలో యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఆవులు సురక్షితంగా ఒడ్డున పడ్డ వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ... గల్లంతైన ఆవుల యజమానులు మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు. వాటిపైనై ఆధారపడి జీవిస్తున్న తమ జీవితాలు ఏమైపోతానంటూ కుమిలిపోతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget