అన్వేషించండి

Andhra News: అడవి పందుల దాడితో జలాశయంలోకి దూకిన ఆవుల మంద, 50 గల్లంతు!

Andhra News: అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. చాకచక్యంగా వ్యవహరించిన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి.

Andhra News:  అడవి పందులను చూసి బెదిరిపోయిన వందలాది ఆవులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటు చేసుకుంది. వాటిలో 400 ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటిలు.. గ్రామానికి చెందిన పలువురి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. 

ఆవుల మందపై ఆధారపడి జీవిస్తున్న పశువుల కాపర్లు..

అయితే చాలా మంది వీరికి తమ ఆవులను మేపమని చెప్పి నెలక కొంత మొత్తంలో డబ్బు ఇస్తుంటారు. అలా మొత్తం వెయ్యి ఆవులను మేపుతూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లాగానే ఆవుల యజమానులు ఆవులను మందలోకి పంపి ఇళ్లకు వెళ్లిపోయారు. మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాల లింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబ కోటిలు పశువులను మేత కోసం.. గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కన ఉన్న మైదాన ప్రాతానికి తీసుకువచ్చారు. అక్కడే ఆవుల మందను నిలపగా.. అవి గడ్డి తింటూ అక్కడక్కడే తిరిగాయి.

పందుల గుంపు రావండోతనే ఆవులు ఆగమాగం..

ఇలా ఓ రెండు మూడు గంటలు గడిచే సరికి... అటు వైపు నుంచి ఓ పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. వాటని గమనించిన ఆవులు తీవ్రంగా భయపడిపోయాయి. వెయ్యి ఆవుల మంద అటూ, ఇటూ పరిగెత్తడం ప్రారంభించాయి. పశువుల కాపర్లు విషయం అర్థం చేసుకునే లోపే 500 ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీశాయి. వీటి వెనుకే పశువుల కాపర్లు కూడా పరిగెత్తారు. కానీ వాళ్లు కట్టపైకి చేరేలోపే 450 ఆవులు జలాశయంలోకి దూకేశాయి. అది చూసిన పశువుల కాపర్లు.. వెంటనే విషయాన్ని యజమానులకు, స్థానిక ప్రజలు తెలియజేశారు. 

సురక్షితంగా ఒడ్డుకు చేరిన 400 ఆవులు..

హుటాహుటిన గ్రామస్థులు, ఆవుల యజమానులు జలాశయం వద్దకు చేరుకున్నారు. మత్స్యకారులకు కూడా సమాచారం అందడంతో.. నాటు పడవలు, పుట్టిలతో రంగంలోకి దిగారు. యజమానులంతా ఆ నాటు పడవలు, పుట్టిల్లో జలాశయంలోకి వెళ్లి ఆవులను కాపాడే ప్రయత్నం చేశారు. అలా చాలా మంది కలిసి మొత్తం 400 ఆవులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. ఇప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. అయితే స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థాలానికి వచ్చారు.

కన్నీరుమున్నీరవుతున్న ఆవుల యజమానులు.. 

సీఐ, ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద ఘటనలో యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఆవులు సురక్షితంగా ఒడ్డున పడ్డ వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ... గల్లంతైన ఆవుల యజమానులు మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు. వాటిపైనై ఆధారపడి జీవిస్తున్న తమ జీవితాలు ఏమైపోతానంటూ కుమిలిపోతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget