అన్వేషించండి

నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది.

నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో మైనార్టీ ఓటర్లు చాలా కీలకం. అందుకే మైనార్టీలను ఆకట్టుకునే కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇక సిటీ నియోజకవర్గంలో మైనార్టీ నేతలెవరూ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ ఓట్లు రెండు పార్టీల మధ్య చీలుతుంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ పోటీకి దిగారు. వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అజీజ్ వైసీపీలో తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టి, నెల్లూరు నగర మేయర్ గా గెలిచి, వెంటనే టీడీపీలోకి వెళ్లడం చాలామందికి నచ్చలేదు. అందుకే ఆయన టీడీపీ తరపున పోటీ చేసినా విజయం వరించలేదు.

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది. 2019లో అజీజ్ పై శ్రీధర్ రెడ్డి 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి మైనార్టీ ఓట్లను గుంప గుత్తగా టీడీపీ సంపాదించాలని చూస్తోంది. సంప్రదాయ ఓటర్లు వైసీపీ, టీడీపీ మధ్య చీలినా, మైనార్టీ ఓటర్లు తమ వర్గానికి చెందిన నాయకుడికే మద్దతిస్తే మాత్రం రూరల్ లో టీడీపీకి పరిస్థితి అనుకూలిస్తుంది. అందుకే అబ్దుల్ అజీజ్ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.


నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టిన శ్రీధర్ రెడ్డి.

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా మైనార్టీ ఓటర్లపై దృష్టిపెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ మొత్తం ఓట్లను పోలరైజ్ చేసేందుకు అబ్దుల్ అజీజ్ ఓవైపు ఎత్తులు వేస్తుంటే మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాత్రం తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వారితో మాటామంతి కలుపుతూ ముందుకు సాగిపోతున్నారు.

టీడీపీ హయాంలో షాదీ మంజిల్ ల నిర్మాణం మొదలైనా, వైసీపీ టైమ్ లో అవి పూర్తయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్లలో వైసీపీ తమకు మేలు చేసిందనే భావన ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో షాదీ తోఫా కార్యక్రమాన్ని వైసీపీ కూడా తిరిగి పునరుద్ధరించడంతో ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ లో మైనార్టీ ఓటర్లు కీలకంగానే ఉన్నా ఎప్పుడూ పార్టీల మధ్య వారి ఓట్లు చీలిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం వారి ఓట్లను గట్టిగా ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారు నాయకులు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో ముందడుగులో ఉన్నట్టు తెలుస్తోంది. బారా షహీద్ దర్గా అభివృద్ధి, రొట్టెల పండగ ఏర్పాట్ల విషయంలో ఆయన బాగా హడావిడి చేశారు. అయితే నిధులిచ్చారు కానీ, కార్యక్రమాలు జరగలేదంటూ ఇటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో జరిగిన పనుల్నే, ఇప్పుడు వైసీపీ నేతలు తాము చేశామని చెప్పుకుంటున్నారని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు మైనార్టీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Viral Video: త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!
త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget