అన్వేషించండి

నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది.

నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో మైనార్టీ ఓటర్లు చాలా కీలకం. అందుకే మైనార్టీలను ఆకట్టుకునే కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇక సిటీ నియోజకవర్గంలో మైనార్టీ నేతలెవరూ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ ఓట్లు రెండు పార్టీల మధ్య చీలుతుంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ పోటీకి దిగారు. వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అజీజ్ వైసీపీలో తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టి, నెల్లూరు నగర మేయర్ గా గెలిచి, వెంటనే టీడీపీలోకి వెళ్లడం చాలామందికి నచ్చలేదు. అందుకే ఆయన టీడీపీ తరపున పోటీ చేసినా విజయం వరించలేదు.

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది. 2019లో అజీజ్ పై శ్రీధర్ రెడ్డి 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి మైనార్టీ ఓట్లను గుంప గుత్తగా టీడీపీ సంపాదించాలని చూస్తోంది. సంప్రదాయ ఓటర్లు వైసీపీ, టీడీపీ మధ్య చీలినా, మైనార్టీ ఓటర్లు తమ వర్గానికి చెందిన నాయకుడికే మద్దతిస్తే మాత్రం రూరల్ లో టీడీపీకి పరిస్థితి అనుకూలిస్తుంది. అందుకే అబ్దుల్ అజీజ్ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.


నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టిన శ్రీధర్ రెడ్డి.

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా మైనార్టీ ఓటర్లపై దృష్టిపెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ మొత్తం ఓట్లను పోలరైజ్ చేసేందుకు అబ్దుల్ అజీజ్ ఓవైపు ఎత్తులు వేస్తుంటే మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాత్రం తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వారితో మాటామంతి కలుపుతూ ముందుకు సాగిపోతున్నారు.

టీడీపీ హయాంలో షాదీ మంజిల్ ల నిర్మాణం మొదలైనా, వైసీపీ టైమ్ లో అవి పూర్తయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్లలో వైసీపీ తమకు మేలు చేసిందనే భావన ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో షాదీ తోఫా కార్యక్రమాన్ని వైసీపీ కూడా తిరిగి పునరుద్ధరించడంతో ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ లో మైనార్టీ ఓటర్లు కీలకంగానే ఉన్నా ఎప్పుడూ పార్టీల మధ్య వారి ఓట్లు చీలిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం వారి ఓట్లను గట్టిగా ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారు నాయకులు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో ముందడుగులో ఉన్నట్టు తెలుస్తోంది. బారా షహీద్ దర్గా అభివృద్ధి, రొట్టెల పండగ ఏర్పాట్ల విషయంలో ఆయన బాగా హడావిడి చేశారు. అయితే నిధులిచ్చారు కానీ, కార్యక్రమాలు జరగలేదంటూ ఇటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో జరిగిన పనుల్నే, ఇప్పుడు వైసీపీ నేతలు తాము చేశామని చెప్పుకుంటున్నారని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు మైనార్టీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget