అన్వేషించండి

నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది.

నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో మైనార్టీ ఓటర్లు చాలా కీలకం. అందుకే మైనార్టీలను ఆకట్టుకునే కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇక సిటీ నియోజకవర్గంలో మైనార్టీ నేతలెవరూ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ ఓట్లు రెండు పార్టీల మధ్య చీలుతుంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ పోటీకి దిగారు. వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అజీజ్ వైసీపీలో తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టి, నెల్లూరు నగర మేయర్ గా గెలిచి, వెంటనే టీడీపీలోకి వెళ్లడం చాలామందికి నచ్చలేదు. అందుకే ఆయన టీడీపీ తరపున పోటీ చేసినా విజయం వరించలేదు.

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది. 2019లో అజీజ్ పై శ్రీధర్ రెడ్డి 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి మైనార్టీ ఓట్లను గుంప గుత్తగా టీడీపీ సంపాదించాలని చూస్తోంది. సంప్రదాయ ఓటర్లు వైసీపీ, టీడీపీ మధ్య చీలినా, మైనార్టీ ఓటర్లు తమ వర్గానికి చెందిన నాయకుడికే మద్దతిస్తే మాత్రం రూరల్ లో టీడీపీకి పరిస్థితి అనుకూలిస్తుంది. అందుకే అబ్దుల్ అజీజ్ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.


నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టిన శ్రీధర్ రెడ్డి.

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా మైనార్టీ ఓటర్లపై దృష్టిపెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ మొత్తం ఓట్లను పోలరైజ్ చేసేందుకు అబ్దుల్ అజీజ్ ఓవైపు ఎత్తులు వేస్తుంటే మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాత్రం తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వారితో మాటామంతి కలుపుతూ ముందుకు సాగిపోతున్నారు.

టీడీపీ హయాంలో షాదీ మంజిల్ ల నిర్మాణం మొదలైనా, వైసీపీ టైమ్ లో అవి పూర్తయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్లలో వైసీపీ తమకు మేలు చేసిందనే భావన ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో షాదీ తోఫా కార్యక్రమాన్ని వైసీపీ కూడా తిరిగి పునరుద్ధరించడంతో ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ లో మైనార్టీ ఓటర్లు కీలకంగానే ఉన్నా ఎప్పుడూ పార్టీల మధ్య వారి ఓట్లు చీలిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం వారి ఓట్లను గట్టిగా ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారు నాయకులు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో ముందడుగులో ఉన్నట్టు తెలుస్తోంది. బారా షహీద్ దర్గా అభివృద్ధి, రొట్టెల పండగ ఏర్పాట్ల విషయంలో ఆయన బాగా హడావిడి చేశారు. అయితే నిధులిచ్చారు కానీ, కార్యక్రమాలు జరగలేదంటూ ఇటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో జరిగిన పనుల్నే, ఇప్పుడు వైసీపీ నేతలు తాము చేశామని చెప్పుకుంటున్నారని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు మైనార్టీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget