అన్వేషించండి

Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

Vijayawada Floods: విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో, వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు ముందున్నారు.

Andhra Pradesh: విజయవాడని వరదలు చుట్టుముట్టాయి. బెజవాడ విలయానికి ఏపీలోని ఇతర ప్రాంతాలు కూడా కంటతడి పెట్టాయి. తమకు తోచినంత సాయం చేయడానికి అన్ని ప్రాంతాల వారు ముందుకొచ్చారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, నేరుగా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలబడేందుకు కూడా అన్ని ప్రాంతాలనుంచి స్వచ్ఛందంగా కొంతమంది కదలి వచ్చారు. నెల్లూరు జిల్లానుంచి కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు ముందున్నారు. 

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరద సాయం కోటి రూపాయలు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబుని కలసి ఆయన చెక్కుని అందించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఆర్థిక సాయం చేశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ అయినా ఆయన నెల్లూరీయుడే. మాగుంట ఫ్యామిలీ తరపున కోటీ యాభై లక్షల రూపాయల భారీ సాయాన్ని ఆయన అందజేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దివంగత నేత, మాగుంట సుబ్బరామిరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్‌రెడ్డి.. సీఎం చంద్రబాబుని కలసి చెక్కు అందించారు. అంతకు ముందే ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియాకు రూ.10లక్షల చెక్కుని కూడా అందించారు. 

ఇక వరద సహాయక చర్యల్లో నెల్లూరు జిల్లా మంత్రులు బిజీగా మారారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబు వెంటే ఉన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన కూడా ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా మంత్రి నారాయణ విజయవాడలోనే మకాం వేశారు. సమీక్షలతో మున్సిపల్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. 


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వరద సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదలు మొదలైన తర్వాత ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. తన శాఖకు సంబంధం లేకపోయినా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేరుగా క్షేత్ర స్థాయిలో దిగి బాధితులకు బాసటగా నిలిచారు. నెల్లూరు నుంచి తన టీమ్ ని కూడా రప్పించి విజయవాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఆనం. నిత్యావసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

నెల్లూరు జనసేన తరపున కూడా ఓ టీమ్ విజయవాడకు వెళ్లింది. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు జనసేన పార్టీ నేతలు గునుకుల కిషోర్ సహా వీర మహిళలు విజయవాడ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జానీ మాస్టర్ సినిమా షూటింగ్ లను సైతం పక్కనపెట్టి విజయవాడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జనసైనికులు స్థానికులకు ఆర్థిక సాయం చేయడంతోపాటు, వస్తువులను కూడా అందించారు. 

నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరపున నెల్లూరు టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులు రూ.10లక్షలు విరాళంగా అందించారు. 


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

నెల్లూరు ఉద్యోగుల సేవలు కూడా తక్కువ చేయలేం. ప్రత్యేకించి నెల్లూరు జిల్లానుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు.. విజయవాడ వెళ్లి అక్కడే మకాం వేశారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనగలిగే అధికారుల్ని విజయవాడ పిలిపించుకుని అక్కడ డ్యూటీలు వేశారు. బాధితుల్ని రక్షించడం, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, పునరావాస కేంద్రాలకు సామగ్రిని చేరవేడయం ఇలా అన్ని కార్యక్రమాలను రెవెన్యూ ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లి వారి సేవలు అందించారు. 


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

నెల్లూరు నగర పాలక సంస్థ తరపున లారీల్లో నిత్యావసరాలు విజయవాడకు తరలించారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ హోటళ్లు ఆహార పదార్థాలను కూడా ఇక్కడినుంచి పంపించాయి. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. వరద ప్రభావం కేవలం విజయవాడకే పరిమితమైనా.. ఇతర ప్రాంతాల నాయకులు, ప్రజలు సహాయక చర్యల్లో తమవంతు బాధ్యత నిర్వర్తించారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget