అన్వేషించండి

నెల్లూరులో రెచ్చిపోతున్న శాండ్ మాఫియా..!

నెల్లూరు నుంచి తమిళనాడుకు ఇసుకు అక్రమంగా వెళ్లిపోతోంది. ప్రభుత్వం ఎవరిది ఉన్నా అక్రమార్కులకు అడ్డుకట్టపడటం లేదు.

ఏపీలో చాలా చోట్ల ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. నెల్లూరులో ల్యాండ్ మాఫియాతోపాటు శాండ్ మాఫియా కూడా ఎక్కువే. నెల్లూరులో ప్రధానంగా పెన్నా నది ఇసుక మంచి ఆదాయ వనరుగా ఉంది. ప్రభుత్వ అధీనంలో ఇసుక ఉన్నప్పుడు, గతంలో టీడీపీ హయాంలో ఉచిత ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నప్పుడు కూడా శాండ్ మాఫియా జోరుగా సాగేది. కానీ ఇప్పుడు మరింత ముదిరిపోయింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి ఇసుక అక్రమంగా రవాణా చేస్తే భారీ ఆదాయం వస్తుంది. అందుకే ఈ సులభమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు కొంతమంది అక్రమార్కులు.

వైసీపీ హయాంలో ఇసుకను పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థలకే అప్పగించడంతో మరింత దారుణంగా ఉంది పరిస్థితి. పెన్నా పరివాహక ప్రాంతం నుంచి వేలాదిగా టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రిపూట ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా కూడా అక్రమ రవాణా ఆగకపోవడం విశేషం. నెల్లూరు నగరం మధ్యలో నుంచి ఇలాంటి ఇసుక లారీలు అర్థరాత్రి వెళ్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నెల్లూరులో రెచ్చిపోతున్న శాండ్ మాఫియా..!

నెల్లూరు జిల్లా జొన్నవాడ సమీపంలోని మినగల్లు ఇసుక రీచ్‌ నుంచి రాత్రిళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సామాన్యులెవరూ దీనిపై ఫిర్యాదు చేయకపోవడంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు ఉంటున్నారు. పైగా దీనిలో రాజకీయ జోక్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. నిత్యం వందల లారీల్లో రాత్రిపూట ఇసుక తరలి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్ నిర్వణ బిడ్ ధర 21 కోట్ల రూపాయలు. అంత భారీ మొత్తంలో డబ్బు వెనక్కి రావాలంటే రాత్రింబవళ్లు పనులు జరగాల్సిందే. అందులోనూ ఇటీవల పెన్నమ్మకు తరచూ భారీ స్థాయిలో వరదనీరు వస్తోంది. దీంతో వరద తగ్గిన వెంటనే ఇసుకను రీచ్ ల లోకి తరలిస్తున్నారు. అక్కడినుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు.


నెల్లూరులో రెచ్చిపోతున్న శాండ్ మాఫియా..!

కొన్ని చోట్ల స్థానికులే రాత్రిపూట జరిగే ఇసుక దందాను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్పటికప్పుడు లారీలను ఆపేస్తున్న కాంట్రాక్టర్లు తెల్లవారు జామునుంచే ఇసుక రవాణా తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ముదివర్తి, నాగరాజుతోపు, మినగల్లు, పీకేపాడు రీచ్‌ లలో ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక టన్ను రూ.475కు విక్రయించాలని నిబంధనలున్నాయి. జిల్లాలోని పది ఓపెన్‌ రీచ్‌ లలో.. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతిచ్చింది కేవలం 7.25 లక్షల టన్నులు మాత్రమే. మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతుండటంతో ఇంతకంటే ఎక్కువగానే తరలించాలని అంటున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గనుల శాఖ ఏడీ శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. నిబంధనల ప్రకారం రాత్రిపూట తవ్వకాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారాయన. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న రీచ్ లలో తనిఖీలు చేపడతామని అన్నారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టినా, రాత్రిపూట తవ్వకాలు, రవాణా చేపట్టినా చర్యలు తీసుకుంటామని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget