అన్వేషించండి

Nellore Farmers: నెల్లూరులో తగ్గిన వరదలు.. ఇంతలో మరో సమస్య, అవస్థలు పడుతున్న రైతులు 

నెల్లూరు జిల్లాలో విత్తనాలు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. రాయితీపై ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

వరదలు తగ్గాయి, వర్షాలు లేవు, పంట వేయడానికి ఇదే అనువైన సమయం. అయితే నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు పెట్టుబడి పెట్టి మోసపోయారు రైతులు. భారీ వర్షాలకు నారుమడుల దశలోనే పంట నీటిపాలైంది. మూడోసారి పెట్టుబడికి వారి వద్ద డబ్బులు లేవు, అటు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామంటున్నా.. అది ఇప్పుడల్లా సాధ్యం అయ్యేలా లేదు. అదను పోతే మళ్లీ ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 

నెల్లూరు జిల్లాలో 7675 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 1804 ఎకరాల్లో మినుము వేసిన రైతులు నష్టపోయారు. పొగాకు, వేరు శెనగ, పెసర.. ఇలా అందరికీ నష్టం జరిగింది. అయితే వరి విషయంలో నష్టాన్ని పూడ్చుకోడానికి కూడా కష్టమే. ఇప్పటికే రెండు సార్లు విత్తనంపై ఖర్చు పెట్టిన రైతులు మరో దఫా నారుమడులు సిద్ధం చేయాలంటే పెట్టుబడిలేక వెనకడుగు వేస్తున్నారు. 


Nellore Farmers: నెల్లూరులో తగ్గిన వరదలు.. ఇంతలో మరో సమస్య, అవస్థలు పడుతున్న రైతులు 

వరి విత్తనాలకు కరవు.. 
నెల్లూరు జిల్లాలో అవసరమైన వరి విత్తనాలు అంటే ఒడ్లు 30 వేల క్వింటాళ్లు కాగా, ప్రస్తుతం కేవలం 9500 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో 15 వేల క్వింటాళ్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ కింద విత్తనాలను అందిస్తే 30 కిలోల విత్తనాల బస్తా 198 రూపాయలకు రైతులకు చేరుతుంది. అదే ప్రైవేటు వ్యాపారి వద్ద కొనుగోలు చేయాలంటే మాత్రం 1200 రూపాయలు. అటు ప్రభుత్వం వద్ద విత్తనాలు సరిగా అందుబాటులోల లేక, ఇటు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయలేక రైతులు సతమతం అవుతున్నారు. 

ఈ నెల 8 తేదీ వరకు వివరాలు సేకరించి, పదో తేదీ నాటికి పూర్తిస్థాయి నష్టాన్ని నమోదు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంచనాలు సేకరించారు. సిబ్బంది ఈ సేకరణలో ఉండటంతో.. రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. అక్కడకు వెళ్లిన వారికి రేపు, మాపు అంటూ సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు. 

వర్షాలు, వరదలకు దెబ్బతిన్న వరి నారుమడుల స్థానంలో తిరిగి సాగుకు అవసరమైన వరి విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరలో కలెక్టర్ చక్రధర్ బాబు ప్రకటించారు.  80 శాతం రాయితీపై రైతులకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ క్షేత్ర స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటుగా అధిక ధరకు కొనుగోలుచేయాల్సి వస్తోంది. దీంతో పేద రైతులకు ఇది భారంగా మారింది.

అదనులో సాగు చేస్తేనే పంట దిగుబడులు బాగుంటాయి. లేకుంటే దిగుబడులు తగ్గుతాయి. చివరకు అప్పులు మిగులుతాయి. ప్రస్తుతం నెల్లూరు మసూరి రకం సాగుకు అనుకూలం. రాయితీతో వరి విత్తనాలు లభించకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు రైతులు. అధికారులు మాత్రం ఈరోజునుంచి విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 

Also Read: Nellore RedCross : రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !

Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !

Also Read : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
Chandrababu and Pawan Kalyan Convoy Reduction:మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్, లోకేష్! మంత్రులు, అధికారులకు కీలక సూచనలు! అమరావతి సంగతేంటని వైసీపీ ప్రశ్నలు!
మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్, లోకేష్! మంత్రులు, అధికారులకు కీలక సూచనలు! అమరావతి సంగతేంటని వైసీపీ ప్రశ్నలు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
Sai Pallavi: ఆ ఫ్లాప్ తర్వాత ఇన్‌స్టాలో సాయి పల్లవి ఫస్ట్ పోస్ట్... లేడీ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు
ఆ ఫ్లాప్ తర్వాత ఇన్‌స్టాలో సాయి పల్లవి ఫస్ట్ పోస్ట్... లేడీ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు
Hyundai India: ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
Cocaine Queen: కోకైన్ క్వీన్ పింకీ - కోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్ - పాకిస్తాన్‌లో అంతే !
కోకైన్ క్వీన్ పింకీ - కోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్ - పాకిస్తాన్‌లో అంతే !
Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
Raashii Khanna : రాశీ ఖన్నా క్యూట్ లుక్ - హాట్ సమ్మర్‌లో కూల్ కలర్స్ కావాలట
రాశీ ఖన్నా క్యూట్ లుక్ - హాట్ సమ్మర్‌లో కూల్ కలర్స్ కావాలట
AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
Embed widget