అన్వేషించండి

Nellore Bus Driver Death: చనిపోతూనే 42 మందిని కాపాడిన బస్ డ్రైవర్, విషాదంలో అయ్యప్పస్వాములు

అప్పటికే భాస్కర్ రావు గుండె నొప్పితో అవస్థ పడుతున్నారు. వారు భాస్కర్ రావు వద్దకు వచ్చి పలకరించారు. అప్పటికే ఆయనలో ఉలుకూ పలుకు లేదు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే ప్రాణాలు వదిలాడు.

ఇటీవల అయ్యప్ప స్వాముల బస్సులకు ఘోర ప్రమాదాలు చూశాం. ఇది కూడా అలాంటిదే. అయితే ఆ ఘోరం తృటిలో తప్పిపోయింది. క్షణకాలం ఆలస్యం అయిఉంటే 42 మంది అయ్యప్ప స్వాముల పరిస్థితి ఏమయ్యేదో చెప్పలేం. కానీ నెల్లూరు జిల్లాలో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. స్వామి శరణం అంటూ బస్సుదిగి ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది. ఆ బస్సులో ఏమైంది..?

అసలేమైంది..?

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ చేసి శబరిమలకు బయలుదేరారు. నెల 16న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుని వారు మాట్లాడుకున్నారు. శబరి యాత్ర మొదలైంది. దర్శనీయ ప్రాంతాలలో బస చేస్తూ వారు యాత్రకు బయలుదేరారు. గురువారం సాయంత్రం బస్సు నెల్లూరు జిల్లాకు చేరుకుంది. బోగోలు మండలంలోని కడనూతల చెరువు ప్రాంతానికి చేరుకునేసరికి బస్సు డ్రైవర్‌ భాస్కర్‌ రావు (38) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి అనిపించింది. అప్పటికీ కొంత దూరం బస్సుని అలాగే నడిపాడు.

తీరా బస్సు కడనూతల వద్ద ఓ ఫ్లైవర్ పైకి వచ్చేసరికి బస్సు నడపలేకపోయారు భాస్కర్ రావు. బస్సుని ఓ రోడ్డుపక్కన ఆపేశారు. డ్రైవర్ సీటు వెనకే విశ్రాంతి తీసుకునే బల్లపై కూర్చున్నాడు. ఎక్కువసేపు కూర్చులేక అక్కడే పడుకున్నాడు. ఆ సమయానికి తన పరిస్థితి ఇదీ అని బస్సులో వెళ్లేవారికి కూడా ఆయన చెప్పలేకపోయారు. సడన్ గా బస్సు రోడ్డుపక్కన ఆపేసే సరికి స్వాములు డ్రైవర్ సీటు వద్దకు వచ్చారు. అప్పటికే భాస్కర్ రావు గుండె నొప్పితో అవస్థ పడుతున్నారు. వారు భాస్కర్ రావు వద్దకు వచ్చి పలకరించారు. అప్పటికే ఆయనలో ఉలుకూ పలుకు లేదు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే ప్రాణాలు వదిలాడు.

మా ప్రాణాలు కాపాడి..

బస్సు నడుపుతూ డ్రైవర్ అస్వస్థతకు గురైతే ఆ బస్సు ఎక్కడో ఒకచోట ఢీకొని ఆగిపోయిన ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి. కానీ ఈ డ్రైవర్ ఆలా కాదు. తనకి ఉన్న ఇబ్బందిని ముందే పసిగట్టాడు. బస్సుని నడిపితే తనతోపాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారనే అవగాహనకు వచ్చాడు. వెంటనే బస్సుని రోడ్డు పక్కన ఆపేశాడు. ఆయన వెనక సీట్లో కుప్పకూలి చనిపోయాడు.


Nellore Bus Driver Death: చనిపోతూనే 42 మందిని కాపాడిన బస్ డ్రైవర్, విషాదంలో అయ్యప్పస్వాములు

భాస్కర్ రావు మృతదేహం తరలింపు..

భాస్కర్‌రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం, ఎ.కోడూరుకు అంబులెన్స్ లో తరలించారు స్వాములు. బస్సు యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. 42మంది స్వాములు భాస్కర్ రావే తమ ప్రాణాలను కాపాడారని, ప్రమాదం జరక్కుండా నివారించారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లాతో పాటు అయ్యప్ప స్వాములు బయలుదేరిన కాకినాడ జిల్లావాసులు కూడా ఈ వార్త తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. స్వాములకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి ఆరా తీసారు. భాస్కర్ రావు కుటుంబానికి కూడా స్వాములు అండగా ఉంటామని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget