అన్వేషించండి

Nellore Boy Dies: నెల్లూరు జిల్లాలో ఘోరం, బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్ వివాదం!

Nellore Crime News: క్రికెట్ మ్యాచ్ లో తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. నెల్లూరు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Nellore Boy Dies while playing cricket: నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. క్షణికా వేశంలో ఓ మైనర్ బాలుడు దాడి చేయగా మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చంపుదామనే ఉద్దేశం లేకపోయినా అతడు దాడి చేయడంతో అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక క్రికెట్ గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన బాలుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

జాకీర్ హుస్సేనే నగర్ లో ఘటన..
ఈరోజు ఆదివారం కావడంతో నెల్లూరులోని జాకీర్ హుస్సేనే నగర్ లో పలువురు స్థానిక యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అందులో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఆపోజిట్ టీమ్ లో 16ఏళ్ల మరో బాలుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య క్రికెట్ లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. క్షణికావేశంలో 16 ఏళ్ల బాలుడు 14 ఏళ్ల బాలుడిపై దాడి చేశాడు. ఒక్కసారిగా గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే బాలుడు కుప్పకూలిపోయాడు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన అతడికి మిగతా స్నేహితులు సపర్యలు చేశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాధిత బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. స్నేహితుల సమాచారంతో వెంటనే చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. తోటి బాలుడి మరణానికి కారణం అయిన మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఒంటిపై గాయాలు లేవు..
చనిపోయిన బాలుడు ఫరీద్ ఒంటిపై ఎక్కడా గాయాలు లేవు. అంటే ఘర్షణ పెద్దగా జరగలేదని తెలుస్తోంది. తగలరానిచోట పెద్దదెబ్బ తగలడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని అంటున్నారు. గుండెపై నేరుగా తన్నడంతో చనిపోయాడు. సీఐ బాబీ ఆధ్వర్యంలో పోలీసులు క్రికెట్ ఆడే ప్రాంతానికి వచ్చారు. ఆ బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు సీఐ బాబీ. 

గూడూరులో మరో ఘటన..
ఇదేరోజు గూడూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గూడూరు రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని 60 ఏళ్ళ మహిళ రైలు కింద పడి మృతి చెందింది. విజయవాడనుండి చెన్నై వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు గూడూరులో స్టాపింగ్ లేదు.. ఈ క్రమంలో భాగంగా అదే రైలుకింద పడి  మహిళ దుర్మరణం చెందింది. మహిళ పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే వివరాలు తెలియాల్సి వుంది. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆమె వివరాలు తెలియలేదు. రైల్వే పోలీసులు ఆమె డెడ్ బాడీని అక్కడినుంచి తరలించారు. ఆమె ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget