అన్వేషించండి

Nellore News: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో

నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఆయన్ను పట్టుకున్నారు. కాయల సతీష్ కుమార్ కి నగదు ఇచ్చిన తర్వాత ఆయనకు లిక్విడ్ టెస్ట్ జరిపారు. అందులో ఆయన దోషిగా తేలారు. దీంతో నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు ఆయన్ని అదుపులోకీ తీసుకున్నారు. 

మ్యుటేషన్ కోసం లంచం..
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహశీల్దార్ కాయల సతీష్ కుమార్, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు బొబ్బ అంకయ్య నుంచి మ్యుటేషన్ కొరకు 10వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కొన్నాళ్లుగా లంచం డబ్బు ఇవ్వకపోవడంతో పని చేయకుండా తిప్పించుకుంటున్నాడు. చివరకు విసిగి వేసారిన రైతు అంకయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనతో రైతు లంచం డబ్బుని సతీష్ కుమార్ కి ఇచ్చాడు. పథకం ప్రకారం ఏసీబీ సిబ్బంది సతీష్ కుమార్ ని ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ ,సిఐ రమేష్ బాబు, జిఎల్ శ్రీనివాస్, వేణు, కిరణ్.. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఆదినుంచీ వివాదాలే.. 

సీతారాంపురం మండలం తహశీల్దార్ గా పనిచేస్తున్న కాయల సతీష్ కుమార్ గతంలో అల్లూరు, సైదాపురం మండలాలో తహశీల్దార్ గా పని చేశారు. అప్పుడు కూడా అతనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో సీఎస్ డీటీగా పనిచేసిన కాలంలో కూడా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అవినీతి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు రైతు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఇటీవల నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలో కూడా అవినీతి ఆరోపణలపై తహశీల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మార్వో స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. 

రైతులు పాస్ బుక్కులకోసం, మ్యుటేషన్లకోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. సచివాలయ వ్యవస్థ వచ్చినా కూడా రైతుల కష్టాలు మాత్రం తీరడంలేదు. పాస్ బుక్కులు చేయించుకోవాలంటే.. వీఆర్వో నుంచి, ఆర్ఐ, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ లకు కూడా లంచం సమర్పించుకోవాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్బుకోసం రైతుల్ని వేధిస్తే మాత్రం వారు కచ్చితంగా తిరగడబతారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఎమ్మార్వో స్థాయి అధికారి నేరుగా తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఇలా బుక్కయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డా వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత వారు మళ్లీ తిరిగి విధుల్లో చేరతారు. ఇది మామూలు వ్యవహారంగా మారిపోయింది. దీంతో కొత్తగా లంచం తీసుకోడానికి కూడా ఎవరూ వెనకాడని పరిస్థితి ఉంది. ఇప్పుడు సీతారాంపురం ఎమ్మార్వో కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget