అన్వేషించండి

Nellore News: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో

నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఆయన్ను పట్టుకున్నారు. కాయల సతీష్ కుమార్ కి నగదు ఇచ్చిన తర్వాత ఆయనకు లిక్విడ్ టెస్ట్ జరిపారు. అందులో ఆయన దోషిగా తేలారు. దీంతో నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు ఆయన్ని అదుపులోకీ తీసుకున్నారు. 

మ్యుటేషన్ కోసం లంచం..
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహశీల్దార్ కాయల సతీష్ కుమార్, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు బొబ్బ అంకయ్య నుంచి మ్యుటేషన్ కొరకు 10వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కొన్నాళ్లుగా లంచం డబ్బు ఇవ్వకపోవడంతో పని చేయకుండా తిప్పించుకుంటున్నాడు. చివరకు విసిగి వేసారిన రైతు అంకయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనతో రైతు లంచం డబ్బుని సతీష్ కుమార్ కి ఇచ్చాడు. పథకం ప్రకారం ఏసీబీ సిబ్బంది సతీష్ కుమార్ ని ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ ,సిఐ రమేష్ బాబు, జిఎల్ శ్రీనివాస్, వేణు, కిరణ్.. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఆదినుంచీ వివాదాలే.. 

సీతారాంపురం మండలం తహశీల్దార్ గా పనిచేస్తున్న కాయల సతీష్ కుమార్ గతంలో అల్లూరు, సైదాపురం మండలాలో తహశీల్దార్ గా పని చేశారు. అప్పుడు కూడా అతనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో సీఎస్ డీటీగా పనిచేసిన కాలంలో కూడా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అవినీతి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు రైతు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఇటీవల నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలో కూడా అవినీతి ఆరోపణలపై తహశీల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మార్వో స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. 

రైతులు పాస్ బుక్కులకోసం, మ్యుటేషన్లకోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. సచివాలయ వ్యవస్థ వచ్చినా కూడా రైతుల కష్టాలు మాత్రం తీరడంలేదు. పాస్ బుక్కులు చేయించుకోవాలంటే.. వీఆర్వో నుంచి, ఆర్ఐ, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ లకు కూడా లంచం సమర్పించుకోవాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్బుకోసం రైతుల్ని వేధిస్తే మాత్రం వారు కచ్చితంగా తిరగడబతారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఎమ్మార్వో స్థాయి అధికారి నేరుగా తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఇలా బుక్కయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డా వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత వారు మళ్లీ తిరిగి విధుల్లో చేరతారు. ఇది మామూలు వ్యవహారంగా మారిపోయింది. దీంతో కొత్తగా లంచం తీసుకోడానికి కూడా ఎవరూ వెనకాడని పరిస్థితి ఉంది. ఇప్పుడు సీతారాంపురం ఎమ్మార్వో కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైఎస్‌ జగన్ కీలక సమావేశం- రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు
వైఎస్‌ జగన్ కీలక సమావేశం- రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Embed widget