అన్వేషించండి

Krishna Patnam Power Plant Problems: ఏపీ ప్రభుత్వం కావాలనే కరెంట్‌ కోతలు పెడుతోందా? అసలు నిజాలేంటి? 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్ కో థర్మల్ పవర్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో నిన్న ఉదయం నుంచి కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో విజయవాడ వీటీపీఎస్‌ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది, అటు విశాఖలోని సింహాద్రి థర్మల్‌ ప్లాంటు నుంచి 400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం కృష్ణపట్నం పవర్ స్టేషనే కావడం విశేషం. ఏపీలో తగ్గిన మొత్తం 1,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కృష్ణపట్నందే మేజర్ వాటా. కృష్ణపట్నంలోని పవర్ ప్లాంట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

నెల్లూరు జిల్లాలో ప్రజల అవస్థలు.. 
నెల్లూరు జిల్లావ్యాప్తంగా కరెంటు కోత అమలవుతోంది. శుక్రవారం ఉదయం రెండు గంటలు, మరో రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండు గంటలు.. ఇలా కరెంటు కోత అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 194 మిలియన్‌ యూనిట్ల పైమాటే. కానీ డిమాండ్‌ కు తగ్గ సరఫరా లేకపోవడంతో కోతలు విధించక తప్పలేదు.

లోడ్‌ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరా ఆపేశారు అధికారులు. పట్టణాలకు సరఫరాలో అంతరాయం లేకపోయినా గ్రామాల్లో మాత్రం కోత తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1-2 గంటల పాటు రొటేషన్‌ పద్ధతిలో విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా అంతరాయం ఏర్పడింది. 

మరోవైపు ఇతర రాష్ట్రాలనుంచి కరెంటు కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా ప్రాంతాల్లో కరెంటు కోత లేకుండా చేస్తున్నాయి అధికార పార్టీలు. అధిక ధరను వెచ్చించి మరీ బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నాయి. దీంతో ఏపీకి ఇబ్బంది ఎదురైంది. రెండురోజులపాటు, ఏపీలో సాంకేతిక సమస్యలు సమసిపోయే వరకు కరెంటు కొనాలన్నా దొరకడంలేదు. అందుకే కరెంటుకోత తప్పనిసరి అయింది. 

విపక్షాల విమర్శలు.. 
ఇక కరెంటు కోతపై టీడీపీ విమర్శలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగుల చలో విజయవాడ ఉద్యమంపై వార్తల్ని ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతోటే కరెంటు కోతలు మొదలయ్యాయని టీడీపీ ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం విశేషం. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం సాంకేతిక సమస్యల వల్లే కరెంటు కష్టాలు ఎదురయ్యాయని వివరణ ఇచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget