By: ABP Desam | Updated at : 16 Apr 2023 02:02 PM (IST)
Edited By: Srinivas
సోమిరెడ్డితో కోటంరెడ్డి (ఫైల్ ఫోటో)
వైసీపీనుంచి బయటకొచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీ తరపున పోటీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఆయనింకా టీడీపీలో చేరలేదు, పసుపు కండువా కప్పుకోలేదు. ఈలోగా రూరల్ లో కోటంరెడ్డి వర్గీయులు, టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం కోసం తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీలోకి పంపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు గిరిధర్ రెడ్డి రూరల్ లో టీడీపీతో సమన్వయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు. టీడీపీలో చేరిన తర్వాత నేరుగా ఆయన ఇలా నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్ని కలవడం ఇదే తొలిసారి.
ముందు కేడర్, తర్వాతే లీడర్..
ముందుగా టీడీపీ కేడర్ తో కోటంరెడ్డి సోదరులు సమన్వయం చేసుకుంటున్నారు. గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఆయన అన్న శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్లలో కనిపించడంలేదు. ఆయన్ను పూర్తిగా టీడీపీ నేతగాన్ లెక్క వేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి మాత్రం తాను రెబల్ ఎమ్మెల్యేగానే కొన్నాళ్లు ఉండాలనుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలు, నిరసనలు ఉంటున్నాయి. ఒకవేళ పార్టీ ముద్ర పడితే, తసత్థులతో ఇబ్బంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఈలోగా ఆయన టీడీపీ కేడర్ తో సఖ్యతగా ఉంటున్నారు. అటు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా టీడీపీ కేడర్ ని కలుపుకొని వెళ్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోకి వచ్చే డివిజన్లలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆత్మీయ సమవేశాలు ఏర్పాటు చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా హడావిడి చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇతర కీలక నేతల్ని కలిశారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలతో నేరుగా గిరిధర్ రెడ్డి కలసిన సందర్భాలు లేవు. తాజాగా ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు సోమిరెడ్డితోపాటు కోటంరెడ్డి వర్గం కూడా టీడీపీలోనే ఉండటంతో.. సఖ్యత తప్పనిసరి అయింది.
గిరిధర్ రెడ్డి రూట్ క్లియర్ చేస్తారా..?
కోటంరెడ్డి వైసీపీలో ఉండగా.. టీడీపీ నేతలపై జరిగిన కొన్ని దాడి కేసుల్లో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు. ఆమధ్య కోటంరెడ్డి ప్రధాన అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ విషయంలో టీడీపీ నుంచి కూడా కొంతమంది కోటంరెడ్డి ఎంట్రీని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన సడన్ ఎంట్రీకి రెడీగా లేరు. ముందుగా టీడీపీలోకి వెళ్లిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీలో ఎంట్రీ ఇచ్చి పార్టీ తరపున పోరాడే సమయానికి ఆ పార్టీలో ఎవరూ ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉండకూడదనే ప్రణాళికతో కోటంరెడ్డి బ్రదర్స్ తమ వ్యూహాలను అమలులో పెట్టారు.
Anantapur: భార్య నల్లపూసల దండ మింగేసిన భర్త, 3 నెలల తర్వాత విషయం వెలుగులోకి
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం