అన్వేషించండి

Inter Students Problems: స్టూడెంట్స్‌కి సమస్య వచ్చింది- ఎగ్జామ్ సెంటరే కదిలొచ్చింది  

నెల్లూరు జిల్లాలో వాగు అడ్డు రావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రాలేకపోయారు. అయితే స్థానిక తహశీల్దార్ ప్రయత్నం, కలెక్టర్ చొరవతో.. ఎగ్జామ్ సెంటరే వారి దగ్గరకు కదిలొచ్చింది.

అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్ష రద్దయింది. అయితే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నెల్లూరు జిల్లాలో వాగు అడ్డు రావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రాలేకపోయారు. అయితే స్థానిక తహశీల్దార్ ప్రయత్నం, కలెక్టర్ చొరవతో.. ఎగ్జామ్ సెంటరే వారి దగ్గరకు కదిలొచ్చింది. దీంతో వారి కష్టాలు తీరాయి. పరీక్ష మిస్ అయిపోతామేమోనన్న భయంతో ఇబ్బంది పడ్డ ఇంటర్ స్టూడెంట్స్.. చివరకు సంతోషంగా పరీక్ష రాశారు. తహశీల్దార్ కృష్ణప్రసాద్, కలెక్టర్ చక్రధర్ బాబుకి మనసులో వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 


Inter Students Problems: స్టూడెంట్స్‌కి సమస్య వచ్చింది- ఎగ్జామ్ సెంటరే కదిలొచ్చింది  

ఏంజరిగిందంటే..? 
నెల్లూరు జిల్లాలో అసని తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కలిగి మండల పరిధిలో పరీక్షలకు హాజరవ్వాల్సిన ఇంటర్‌ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కలిగిరి మండలంలోని సిద్దనకొండూరు గ్రామం 14వ మైలు మార్గంలో పరికోట వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిద్దనకొండూరు, అనంతపురం గ్రామాల నుంచి కావలికి రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఆ రెండు గ్రామాలనుంచి 8 మంది ఇంటర్‌ విద్యార్థులు కావలిలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. దీంతో వారంతా పరీక్ష రాయలేమేమోననే భయంలో ఉన్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన పడ్డారు. 


Inter Students Problems: స్టూడెంట్స్‌కి సమస్య వచ్చింది- ఎగ్జామ్ సెంటరే కదిలొచ్చింది  

తహశీల్దార్ సమయస్ఫూర్తి.. 
అప్పటికే పరీక్ష టైమ్ దగ్గరపడింది. పరీక్ష ముందు కావలి బయలుదేరిన పిల్లల వ్యాన్ వాగుకు ముందు ఆగిపోయింది. వాగు దాటినా.. వారంతా కావలి చేరుకోవడం ఆలస్యమవుతుంది. దీంతో తహశీల్దార్ కృష్ణప్రసాద్ విషాయన్ని కలెక్టర్ చక్రధర్ బాబుకి చేరవేశారు. ఫోన్లో సమాచారం అందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. కావలి వెళ్లలేరు కాబట్టి.. వారికి ప్రత్యామ్నాయంగా మరో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కలిగిరిలో వారికి పరీక్ష రాసేందుకు అవకాశమిచ్చారు. అలా విద్యార్థులంతా వాగుదాటి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 


Inter Students Problems: స్టూడెంట్స్‌కి సమస్య వచ్చింది- ఎగ్జామ్ సెంటరే కదిలొచ్చింది  

విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్న తహశీల్దార్ వెంటనే పరికోట వాగు దగ్గరకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో  పిల్లలను వాగు దాటించారు. స్థానికులంతా మానవహారంలా ఏర్పడి పిల్లలను వాగు దాటించారు. ఆ తర్వాత పిల్లలకు అసలు విషయం చెప్పారు. కావలి వెళ్లాల్సిన పనిలేదని, కలిగిరి కేంద్రంలోనే పరీక్ష రాసేలే చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీంతో పిల్లల ఆనందానికి అవధులు లేవు. పరీక్ష టైమ్ ముంచుకొస్తుంది, కావలి వెళ్లే టైమ్ లేదని భయపడిన వారంతా.. దగ్గరలోని కలిగిరి సెంటర్లో పరీక్షలు రాశారు. పిల్లలను తహశీల్దార్ తన కారులో, మరో ఆటోలో పరీక్ష కేంద్రానికి తరలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐవో, అధికారులు వారికి కలిగిరిలోనే పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు వచ్చేలోపు పరీక్ష కేంద్రంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget