అన్వేషించండి

కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం

టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు.

కందుకూరు దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారు. మృతదేహాలకు ఆయన ఘన నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను దగ్గరుండి ఓదార్చారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం పెంచింది. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పార్టీ తరపున ప్రకటించారు. ఇక టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం దీనికి అదనం.


కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం

టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు అందే సాయం..

1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-

2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష

3.ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష

4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష

5.బేబీ నాయన రూ.50,000

6.కేశినేని చిన్ని రూ.50,000

7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.

8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష

9.అబ్దుల్ అజీజ్ రూ.50,000

10 పోతుల రామారావు రూ.50,000

11.పొడపాటి సుధాకర్ రూ.50,000

12.వెనిగండ్ల రాము రూ. 50,000

15మందికి గాయాలు కాగా వారి వైద్య ఖర్చులను టీడీపీ భరిస్తోంది. వారికి ఆర్థిక సాయంగా 50వేల రూపాయలను అందిస్తున్నారు నేతలు. ఈరోజు మధ్యాహ్నం వరకు చంద్రబాబు కందుకూరులోనే ఉంటారు. భోజన విరామం తర్వాత కావలిలో జరుగు రోడ్ షో లో పాల్గొనడానికి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కావలి నియోజకవర్గం చేరుకుంటారు. కావలి అండర్ పాస్ మాల్యాద్రి కాలనీ, ఓగూరు, కన్నమల వద్ద ఆగి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు భాష్యం పాఠశాల మీదుగా రోడ్ షో ఉంటుంది. 5.30 గంటలకు కావలిలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో బస చేస్తారు చంద్రబాబు.

కందుకూరులో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని కావలి పర్యటనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీ ప్రతినిధులు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని గుమికూడకుండా.. కాస్త దూరంగా ఉండేలా బ్యారికేడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. కావలిలో చంద్రబాబు ప్రసంగించే బస్టాండ్ సమీపంలో ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్ఘటన తర్వాత పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కావలిలో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కందుకూరు ఘటన తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ కాస్త మారింది. కావలిలో రోడ్ షో అనుకున్నంత సేపు జరిగే అవకాశం లేదు. రోడ్ షో త్వరగా ముగించుకుని ఆ తర్వాత బహిరంగ సభకు వస్తారు చంద్రబాబు. కోవూరులో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కోవూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరులో చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఖరారైంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget