అన్వేషించండి

కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం

టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు.

కందుకూరు దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారు. మృతదేహాలకు ఆయన ఘన నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను దగ్గరుండి ఓదార్చారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం పెంచింది. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పార్టీ తరపున ప్రకటించారు. ఇక టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం దీనికి అదనం.


కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం

టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు అందే సాయం..

1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-

2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష

3.ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష

4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష

5.బేబీ నాయన రూ.50,000

6.కేశినేని చిన్ని రూ.50,000

7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.

8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష

9.అబ్దుల్ అజీజ్ రూ.50,000

10 పోతుల రామారావు రూ.50,000

11.పొడపాటి సుధాకర్ రూ.50,000

12.వెనిగండ్ల రాము రూ. 50,000

15మందికి గాయాలు కాగా వారి వైద్య ఖర్చులను టీడీపీ భరిస్తోంది. వారికి ఆర్థిక సాయంగా 50వేల రూపాయలను అందిస్తున్నారు నేతలు. ఈరోజు మధ్యాహ్నం వరకు చంద్రబాబు కందుకూరులోనే ఉంటారు. భోజన విరామం తర్వాత కావలిలో జరుగు రోడ్ షో లో పాల్గొనడానికి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కావలి నియోజకవర్గం చేరుకుంటారు. కావలి అండర్ పాస్ మాల్యాద్రి కాలనీ, ఓగూరు, కన్నమల వద్ద ఆగి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు భాష్యం పాఠశాల మీదుగా రోడ్ షో ఉంటుంది. 5.30 గంటలకు కావలిలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో బస చేస్తారు చంద్రబాబు.

కందుకూరులో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని కావలి పర్యటనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీ ప్రతినిధులు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని గుమికూడకుండా.. కాస్త దూరంగా ఉండేలా బ్యారికేడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. కావలిలో చంద్రబాబు ప్రసంగించే బస్టాండ్ సమీపంలో ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్ఘటన తర్వాత పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కావలిలో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కందుకూరు ఘటన తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ కాస్త మారింది. కావలిలో రోడ్ షో అనుకున్నంత సేపు జరిగే అవకాశం లేదు. రోడ్ షో త్వరగా ముగించుకుని ఆ తర్వాత బహిరంగ సభకు వస్తారు చంద్రబాబు. కోవూరులో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కోవూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరులో చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఖరారైంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget