By: ABP Desam | Updated at : 29 Dec 2022 01:16 PM (IST)
Edited By: Srinivas
కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం
కందుకూరు దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారు. మృతదేహాలకు ఆయన ఘన నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను దగ్గరుండి ఓదార్చారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం పెంచింది. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పార్టీ తరపున ప్రకటించారు. ఇక టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం దీనికి అదనం.
టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు అందే సాయం..
1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-
2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష
3.ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష
4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష
5.బేబీ నాయన రూ.50,000
6.కేశినేని చిన్ని రూ.50,000
7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.
8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష
9.అబ్దుల్ అజీజ్ రూ.50,000
10 పోతుల రామారావు రూ.50,000
11.పొడపాటి సుధాకర్ రూ.50,000
12.వెనిగండ్ల రాము రూ. 50,000
15మందికి గాయాలు కాగా వారి వైద్య ఖర్చులను టీడీపీ భరిస్తోంది. వారికి ఆర్థిక సాయంగా 50వేల రూపాయలను అందిస్తున్నారు నేతలు. ఈరోజు మధ్యాహ్నం వరకు చంద్రబాబు కందుకూరులోనే ఉంటారు. భోజన విరామం తర్వాత కావలిలో జరుగు రోడ్ షో లో పాల్గొనడానికి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కావలి నియోజకవర్గం చేరుకుంటారు. కావలి అండర్ పాస్ మాల్యాద్రి కాలనీ, ఓగూరు, కన్నమల వద్ద ఆగి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు భాష్యం పాఠశాల మీదుగా రోడ్ షో ఉంటుంది. 5.30 గంటలకు కావలిలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో బస చేస్తారు చంద్రబాబు.
కందుకూరులో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని కావలి పర్యటనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీ ప్రతినిధులు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని గుమికూడకుండా.. కాస్త దూరంగా ఉండేలా బ్యారికేడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. కావలిలో చంద్రబాబు ప్రసంగించే బస్టాండ్ సమీపంలో ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్ఘటన తర్వాత పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కావలిలో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కందుకూరు ఘటన తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ కాస్త మారింది. కావలిలో రోడ్ షో అనుకున్నంత సేపు జరిగే అవకాశం లేదు. రోడ్ షో త్వరగా ముగించుకుని ఆ తర్వాత బహిరంగ సభకు వస్తారు చంద్రబాబు. కోవూరులో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కోవూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరులో చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఖరారైంది.
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు
తమ్ముడూ అనిల్ గతం మరచిపోకు- ఆనం ఫ్యామిలీకి నువ్వు చేసిందేంటీ? శ్రీధర్ రెడ్డి కౌంటర్
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !