అన్వేషించండి

నెలాఖరులోగా నెల్లూరు పవర్ ప్లాంట్ మూడో యూనిట్ పూర్తి 

రాష్ట్ర విభజన అనంతరం ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమృద్ధిగా ఉంది. ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. 

ప్రస్తుతం మూడో యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ నడవటం శుభపరిణామం అంటున్నారు అధికారులు. దేశంలోనే తొలిసారి సూపర్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థర్మల్ పవర్ ప్లాంట్‌ త్వరలో వాణిజ్య ఉత్పాదన మొదలు పెడుతుంది. ఈ నెలాఖరుకు మూడో యూనిట్ ని కూడా జాతికి అంకితం చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టులోని మూడు యూనిట్లకు పలు అనుకూలాంశాలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ప్రత్యేక బాయిలర్‌, చిమ్నీ నిర్మాణం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 

మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుతం ఏపీ జెన్‌ కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. నేలటూరులో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న గాయత్రి, ఎన్సీపీ థర్మల్‌ పవర్ ప్రాజెక్టుల్లో యూనిట్‌ విద్యుత్ ఉత్పత్తికి రూ.2.60 వరకు ఖర్చవుతోంది. ఏపీ జెన్ కో లోని యూనిట్‌ కి రూ.3.90 ఖర్చవుతోందని తెలుస్తోంది. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు థర్మల్‌ ప్రాజెక్ట్ లకు విదేశాల నుంచి తక్కువ ధరకు బొగ్గు వస్తోందని, దీంతో వాటిలో తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అంటున్నారు. మరి ఏపీ జెన్ కో వారికంటే అధిక ధరకు ఎందుకు బొగ్గుని దిగుమతి చేసుకుంటుందో తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెలాఖరులోనే దాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget