అన్వేషించండి

నెలాఖరులోగా నెల్లూరు పవర్ ప్లాంట్ మూడో యూనిట్ పూర్తి 

రాష్ట్ర విభజన అనంతరం ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమృద్ధిగా ఉంది. ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. 

ప్రస్తుతం మూడో యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ నడవటం శుభపరిణామం అంటున్నారు అధికారులు. దేశంలోనే తొలిసారి సూపర్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థర్మల్ పవర్ ప్లాంట్‌ త్వరలో వాణిజ్య ఉత్పాదన మొదలు పెడుతుంది. ఈ నెలాఖరుకు మూడో యూనిట్ ని కూడా జాతికి అంకితం చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టులోని మూడు యూనిట్లకు పలు అనుకూలాంశాలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ప్రత్యేక బాయిలర్‌, చిమ్నీ నిర్మాణం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 

మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుతం ఏపీ జెన్‌ కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. నేలటూరులో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న గాయత్రి, ఎన్సీపీ థర్మల్‌ పవర్ ప్రాజెక్టుల్లో యూనిట్‌ విద్యుత్ ఉత్పత్తికి రూ.2.60 వరకు ఖర్చవుతోంది. ఏపీ జెన్ కో లోని యూనిట్‌ కి రూ.3.90 ఖర్చవుతోందని తెలుస్తోంది. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు థర్మల్‌ ప్రాజెక్ట్ లకు విదేశాల నుంచి తక్కువ ధరకు బొగ్గు వస్తోందని, దీంతో వాటిలో తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అంటున్నారు. మరి ఏపీ జెన్ కో వారికంటే అధిక ధరకు ఎందుకు బొగ్గుని దిగుమతి చేసుకుంటుందో తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెలాఖరులోనే దాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget