అన్వేషించండి

నెలాఖరులోగా నెల్లూరు పవర్ ప్లాంట్ మూడో యూనిట్ పూర్తి 

రాష్ట్ర విభజన అనంతరం ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమృద్ధిగా ఉంది. ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. 

ప్రస్తుతం మూడో యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ నడవటం శుభపరిణామం అంటున్నారు అధికారులు. దేశంలోనే తొలిసారి సూపర్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థర్మల్ పవర్ ప్లాంట్‌ త్వరలో వాణిజ్య ఉత్పాదన మొదలు పెడుతుంది. ఈ నెలాఖరుకు మూడో యూనిట్ ని కూడా జాతికి అంకితం చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టులోని మూడు యూనిట్లకు పలు అనుకూలాంశాలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ప్రత్యేక బాయిలర్‌, చిమ్నీ నిర్మాణం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 

మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుతం ఏపీ జెన్‌ కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. నేలటూరులో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న గాయత్రి, ఎన్సీపీ థర్మల్‌ పవర్ ప్రాజెక్టుల్లో యూనిట్‌ విద్యుత్ ఉత్పత్తికి రూ.2.60 వరకు ఖర్చవుతోంది. ఏపీ జెన్ కో లోని యూనిట్‌ కి రూ.3.90 ఖర్చవుతోందని తెలుస్తోంది. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు థర్మల్‌ ప్రాజెక్ట్ లకు విదేశాల నుంచి తక్కువ ధరకు బొగ్గు వస్తోందని, దీంతో వాటిలో తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అంటున్నారు. మరి ఏపీ జెన్ కో వారికంటే అధిక ధరకు ఎందుకు బొగ్గుని దిగుమతి చేసుకుంటుందో తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెలాఖరులోనే దాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
Reliance AI Data Centre At Bhogapuram: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget