అన్వేషించండి

Raghurama krishna raju: భవధీయుడు మీ రఘురామకృష్ణరాజు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్ కు లేఖలు సంధిస్తున్న విషయం తెలిసిందే. సూచనలు చేస్తూ.. లేఖలు రాసినా.. అవి జనాల్లోకి వేరేలా వెళ్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు .. తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌కు వరుసగా లేఖలు సంధిస్తున్నారు. మొదటగా నవ కర్తవ్యాల పేరిట హితబోధ చేశారు. తర్వాత నవ సూచనలు పేరుతో సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన లేఖలు సంధిస్తూనే ఉన్నారు. ఈ లేఖలు మీడియాలో హైలెట్ అవుతూండటం వైసీపీ పెద్దలకు అస్సలు నచ్చడం లేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. కానీ చేయగలిగిందంతా ఇప్పటికే చేసేశారు. చేయడానికి ఏం లేదు. ఈ పరిస్థితిని రఘురామరాజు చాలా పక్కాగా ఉపయోగిచుకుంటున్నారు. మరింత ఘాటుగా లేఖలు సంధిస్తున్నారు. 

రఘురామకృష్ణరాజు తొలిసారి ఎంపీ అయ్యారు. కానీ ఆయన రాజకీయాన్ని మొత్తం కాచి వడపోసినట్లుగా ఉన్నారు. తమ పార్టీని ఎక్కడా ధిక్కరించడం లేదని చెబుతూనే... పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. మొదట ఆయన నవ ప్రభుత్వ హామీలు.. వైఫల్యాలు పేరుతో లేఖలు రాశారు. తర్వాత నవ కర్తవ్యాల సీరిస్ తీసుకున్నారు.  ఈ లేఖల్లో ..తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పుకుని..అంతే పవిత్రంగా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మేనిఫెస్టోలోని డొల్లతనం మొత్తం బయట పెట్టారు. తొమ్మిది ప్రధానమైన హామీల్లోని లోపాలను వెల్లడించారు. 

ప్రధానంగా సామాజిక పెన్షన్షన్లు రూ. మూడు వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చినహామీలు అమలు చేయకపోవడాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిజానికి ఇది పించన్ దారుల్లో చర్చనీయాంశమైన విషయం. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడమో.. మరో కారణమో కానీ సీఎం జగన్.. ఈ హామీని అమలు చేయడానికి పించన్ దారులకు మరో రూ. 250 పెంచడానికి ఆయన పెద్దగా ఆసక్తిగా లేరు. దీనితో ప్రారంభించిన రఘురామ.. తొమ్మిది రోజుల పాటు మేనిఫెస్టోలోని హామీలను గుర్తు చేస్తూ.. లేఖలు సంధించారు. తన లేఖల్లో ప్రధానమైన హామీల అమలు డొల్లతనం మొత్తం బయట పెట్టారు. చివరికి జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్లు కూడా ఇవ్వకపోవడాన్ని ఓ లేఖలో ప్రస్తావించారు. నవ కర్తవ్యాల పేరిట.. ఏం చేయాలో.. కూడా లేఖలు పంపారు. అలాగే.. నవ సూచనలు పేరుతో సలహాలు.. సూచనలు కూడా ఇచ్చారు.

రఘురామకృష్ణరాజు లేఖలు.., సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. చదివే వారికి సమస్య ఇట్టే అర్థమైపోతుంది. అందుకే..  ఈ లేఖలు వైరల్ కావడం... వైసీపీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన లేఖలు మాత్రం ఆపడం లేదు. అలాగని.. ఆ లేఖల్లో పార్టీ ధిక్కరణ అంశాలు ఏమీ ఉండవు. ఇట్లు మీ విధేయుడు అనే ముగిస్తారు. అంతే గౌరవంగా ప్రారంభిస్తారు కూడా. ఎక్కడో చోట..కాదు.. ప్రతీ చోట.. మన పార్టీ.. మన ప్రభుత్వం అని సంబోధిస్తూనే ఉంటారు. దీంతో అవి .. మంచి కోసం చెబుతున్న సూచనల్లాగే ఉంటాయి కానీ.. బయట ప్రజల్లో జరిగే ప్రచారం మాత్రం వేరుగా ఉంటుంది.  

రఘురామకృష్ణరాజు .. తమ అధినేత జగన్‌ను టీజింగ్ చేస్తున్నారని..వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ అసహనం.. సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. రఘురామకృష్ణరాజును... వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు. అయినా రఘురామ మాత్రం పట్టించుకోరు. తన లేఖలు తాను రాస్తూనే ఉంటారు. అందుకే... ప్రతిపక్షం కన్నా ఎక్కువగా వైసీపీకి ఇప్పురు రఘురామ టార్గెట్ అయ్యారు. ఆయన విషయంలో తీసుకుంటున్న ప్రతి చర్య.. రివర్స్ లో ఆయనను రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతోంది కానీ.. ఆయనను కంట్రోల్ చేయలేకపోతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget