అన్వేషించండి

Raghurama krishnaraju: సభలో రఘురామకు మైక్ దొరికితే జరిగేది ఇదే..! 

లోక్ సభలో మాట్లాడే ఛాన్స్ కోసం రఘురామకృష్ణ వేచి చూస్తున్నారా? ఒకవేళ మైక్ దొరికితే.. ఆయన ఏం మాట్లాడతారు? దీనిపై వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది?

 

లోక్‌సభలో మాట్లాడే ఛాన్స్ కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఓ వైపు స్పీకర్ ఓంబిర్లాకు పదే పదే విజ్ఞాపనపత్రాలు సమర్పించారు. మరో వైపు అమిత్ షాతో జరిగిన భేటీలోనూ.. తనకు జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. సభను స్తంభింపచేయడానికైనా సిద్ధమే కానీ.. రఘురామను మాత్రం మాట్లాడనీయబోమన్న వ్యూహాన్ని వైసీపీ ..ఎంపీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకూ రఘురామకృష్ణరాజు.. సభలో ఐదు నిమిషాలు మాట్లాడితే ఏమవుతుంది..?  వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది..? మాట్లాడకుండా సభను సైతం స్తంభింపచేస్తామని ఎందుకు చెబుతున్నారు..?. ఇవే అసలు సందేహాలు. ఆయన మాట్లాడాల్సినవన్నీ రోజూ మాట్లాడుతున్నారు. కొత్తగా మాట్లాడటానికి ఏమీ ఉండదు. మరి ఎందుకు భయపడుతున్నారు..?

రఘురామకృష్ణరాజు మంచి స్పీకర్ . ఈ విషయంలో ఎలాంటి సందేహ లేదు. చెప్పాలనుకున్నదాన్ని సూటిగా చెబుతారు. ఏ అంశాన్ని ఎలా చెప్పాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తనపై సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసు... ఆ తర్వాత సీఐడీ అధికారులు తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని  ఆయన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. ఆత్మాభిమానంతో కొట్టిన విషయాన్ని బయటకు చెప్పుకోరని సీఐడీ పోలీసులు అనుకున్నారేమో కానీ.. ఆయన మాత్రం.. ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఎలా ఇబ్బందులు పెట్టిందో..  వాటన్నింటినీ దేశం మొత్తం తెలిసేలా చేయగలిగారు. 

తనకు బెయిల్ లభించి ఢిల్లీకి వెళ్లిన తర్వాత నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారందరికీ లేఖలు రాశారు. ముందుగా తోటి పార్లమెంట్ సభ్యులందరికీ లేఖలు రాశారు. ఏపీ సీఎం ప్రోద్భలంతో ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని అందులో వివరించారు. అసలేం జరిగిందో.. సీఎం ఎలాంటి కుట్రలు చేస్తున్నారో...  రఘురామకృష్ణరాజు లేఖలో వివరించారు. ఆ తర్వాత చాలా మంది ఎంపీలు.. రఘురామ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అదే తరహా లేఖలను తర్వాత గవర్నర్లకు రాశారు. కేంద్రమంత్రులకు రాశారు. చివరికి రాష్ట్రపతికి కూడా పంపించారు. చెప్పాల్సిన వాళ్లందరికీ చెప్పేశారు. ఇప్పుడు ఆయన దృష్టి లోక్‌సభపై పడింది. 
 
లోక్‌సభ జీరో అవర్‌లోనూ తనపై నమోదవుతున్న కేసుల అంశాన్ని రఘురామకృష్ణరాజు ప్రస్తావించాలని గతంలోనే నిర్ణయించారు. ప్రత్యక్షంగా కూడా సభలో సభ్యులందరికీ పరిస్థితిని వివరిస్తాననని చెబుతూ వస్తున్నారు.  నిజంగా ఆయనకు జీవో అవర్‌లో మాట్లాడే పరిస్థితి వస్తే..  మొత్తం వ్యవహారం రికార్డులకు ఎక్కుతుంది. ఇప్పటికే.. రఘురామపై దాడి వ్యవహారం..  హ్యూమన్ రైట్స్ కమిష‌న్ సహా.. సుప్రీంకోర్టు వరకూ..అన్ని చోట్లా విచారణలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో పార్లమెంట్‌ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే ఏపీ ప్రభుత్వ ఇమేజ్ మరింత దిగజారిపోతుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. సొంత పార్టీ ఎంపీని దారుణంగా హింసించిన ముద్ర వైసీపీ మీద.. జగన్మోహన్ రెడ్డి పైన పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget