అన్వేషించండి

Raghu Rama Vs YSRCP: వైఎస్ఆర్‌సీపీ వర్సెస్‌ వైఎస్ఆర్‌సీపీ.. ఢిల్లీలో టెన్షన్ రేపుతున్న రఘురామ - వైసీపీ ఎంపీల పోటాపోటీ రాజకీయం..!

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణరాజు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన రాష్ట్రానికి చెందిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా మీడియాకు తెలిపారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సమయంలో  ఆయన వరుసగా బీజేపీ పెద్దలతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. తనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఇప్పటికే అన్ని రాజ్యాంగ వ్యవస్థలకూ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల నుంచి ఆయన అమిత్ షాతో భేటీ కావాలని అనుకుంటున్నారు. అపాయింట్‌మెంట్ దొరకడంతో కలిశారు. రఘురామ అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబసభ్యులు అమిత్ షాతో సమావేశమయ్యారు. 

రఘురామ కృష్ణరాజు వైసీపీ ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఇలా పెడుతున్నందున అంతు చూస్తామని మరో ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించినట్లుగా రఘురామ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో విపక్ష పార్టీలు.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. పెగసస్ పై విచారణకు పట్టుబడుతున్నాయి. వైసీపీ ఎంపీలు మాత్రం కొన్ని సందర్భాల్లో పార్టీ ధిక్కరించిన వారిపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తనపై అనర్హతా వేటు వేయించాలన్న వైసీపీ ఎంపీల ప్రయత్నాలను రఘురామ కృష్ణరాజు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎవరికి ఫిర్యాదు చేస్తారో .. వెంటనే రఘురామ వారికి వివరణ పంపుతున్నారు. తనపై అనర్హతా వేటు ఎలా సాధ్యం కాదో వివరిస్తున్నారు. తానేమీ పార్టీని ధిక్కరించలేదని ఇతర పార్టీల్లో చేరలేదని.. ఆయన చెబుతున్నారు. చట్టం ప్రకారం తానేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూపడం ప్రజాస్వామ్యమని వాదిస్తున్నారు. దీంతో అనర్హతా వేటు వేయించాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల ప్రయత్నాలు పెద్దగా సఫలం కావడం లేదు. 

మరో వైపు రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేంద్ర ప్రభుత్వ శాఖలకు లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో అమ్ముతున్న మద్యం శాంపిల్స్  సేకరించి ప్రజారోగ్య నిపుణులతో పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వారికి చెందిన వ్యక్తుల డిస్టిలరీల నుంచి వస్తున్న మద్యం.. శ్రామికుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్‌కు మరో లేఖను రఘురామ రాశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget