అన్వేషించండి

Avinash Letter To CBI: సీబీఐకి లెటర్ ఇచ్చిన అవినాష్ రెడ్డి - అందులో ఏముంది?

వివేకా హత్య కేసులో తనకు ఉన్నసమచాారం, సందేహాలపై ఓ లేఖను సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి ఇచ్చారు . ఆ లేఖలో ఏముంది ?

Avinash Letter To CBI:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో సారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు ఓ ప్రత్యేకమైన లేఖ అందించినట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారంతో పాటు తనకు ఉన్న సందేహాలను అందులో పేర్కొన్నానని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పాలనుకున్నది సీబీఐకి చెప్పవచ్చు కదా.. ప్రత్యేకంగా లేఖ ఇవ్వడం ఎందుకన్నది కూడా ఆసక్తి రేుపతోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి సీబీఐ తీరుపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో పాటు సీబీఐ డైరక్టర్‌కూ లేఖ రాశానని అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పారు. 

తనకున్న సందేహాలపై లేఖ ఇచ్చానన్న  అవినాష్ రెడ్డి !

సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని.. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాను , కానీ రికార్డ్ చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు రోజు మీడియా తో మొట్ట మొదట గా మాట్లాడింది తానేనన్నారు.  ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నానని.. ఇప్పుడు కేసు విచారణ వ్యక్తి టార్గెట్ గా నడుస్తుందన్నారు. మొదటి సారి విచారణ కు వచ్చినప్పుడు మరో సారి రావాలని చెప్పారు  కానీ ఇప్పుడు విచారణ ముగిసిన తరువాత  మరోసారి విచారణకు రావాలని ఏమి చెప్పలేదని  అవినాష్ రెడ్డి మీడియాకుచెప్పారు.  వివేకా హత్య కు సంబంధించి నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాను ...మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణ పై ప్రభావం పడుతోందన్నారు.  

విచారణ ఏకపక్షంగా జరుగుతోందన్న అవినాష్ రెడ్డి 

తనకు  160సీఆర్పీసి కింద ఇచ్చిన నోటీస్ ఇచ్చారని.. తనను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారా  తెలీదని చెప్పుకొచ్చారు.  టిడిపి సంవత్సరం కింద చెప్పిన అంశంలనే సి బి ఐ కౌంటర్ లో చెప్పిందన్నారు.  వివేక మర్డర్ జరిగిన రోజు దొరికిన లెటర్ ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ లేఖ ను బయటికి తీసుకురావాలని కోరుతున్నానని మీడియాకు చెప్పారు. తన విచారణలో ఎక్కడ ఆడియో వీడియో రికార్డింగ్ లేదని.. న్యాయవాదులను అనుమతించాలని కోరాను అందుకు సిబిఐ ఒప్పుకోలేదని ఆయన చెబుతున్నారు. సీబీఐ అధికారులు చెబుతున్న గూగుల్ టెక్ ఔట్ .. టీడీపీ టెక్ ఔట్ అయి ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు.  విచారణ పూర్తిగా ఏక పక్షంగా జరుగుతోందన్నారు. 

కీలక అంశాలపై విచారణ !

గత విచారణలో  కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపారు. ఆ సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిల పీఏలకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారినీ సీబీఐ విచారించింది.  శుక్రవారం నాటి విచారణలో  బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.  దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నరని అంటున్నారు.  వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Embed widget