అన్వేషించండి

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లు

ఎమ్మెల్సీ ఎన్ని­కల కోసం మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేడు (మార్చి 13) ఉదయం 8 గంటలకే ప్రారంభం అయింది. మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. 

ఎమ్మెల్సీ ఎన్ని­కల కోసం మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేశారు. మూడు పట్టభద్రులు, రెండు టీచర్లు, మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 10,59,420 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వాడుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 584 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ మైక్రో అబ్జర్వర్లతోపాటు బయట వీడియో గ్రాఫర్‌లను కూడా ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం లోకల్‌ అథారిటీ నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శ్రీకాకుళం –విజయనగరం – విశాఖపట్నం నుంచి 37 మంది, ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నుంచి 22, కడప – అనంతపురం – కర్నూలు నుంచి 49 మంది పోటీ పడుతున్నారు. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 8 మంది, కడప – అనంతపురం – కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. 

ఇక్కడ ఏకగ్రీవం
మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకాగా అందులో ఐదుచోట్ల కేవలం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం లోకల్‌ అథారిటీ నుంచి ఎస్‌.మంగమ్మ, కడప పి. రామసుబ్బారెడ్డి, నెల్లూరు మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం సిపాయిల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. 

ఎన్నికల లెక్కింపు ఎప్పుడంటే
ఎనిమిదిచోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపర్చడానికి ఎనిమిది చోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 40 టేబుల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓట్ల లెక్కింపు వేరుగా ఉండడంతో దానికి తగ్గట్లుగా అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఫలితాలు తెలిసేందుకు రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.

టీడీపీ నేత అరెస్టు

తిరుపతిలోని సత్యనారాయణ పురం పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటు లేకున్నా వైసీపీ నాయకులను పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారంటూ మబ్బు దేవనారాయణ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దేవనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

మరోవైపు, సదుంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగించుకున్నారు.

కడపలో వైఎస్ఆర్ సీపీ - టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం

కడప నగరంలోని గాంధీ నగర్ పొలింగ్ స్టేషన్ లో 22వ బూత్‌లో వైఎస్ఆర్ సీపీ - టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో వాలంటీర్ విధులు నిర్వహిస్తున్నాడంటూ టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. బయటకు పంపాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించి ఇరువురికి బయటకు పంపేశారు.

టాప్ హెడ్ లైన్స్

Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget