అన్వేషించండి

Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!

Mission Vatsalya: అనాథ పిల్లల రక్షణ, భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మిషన్ వాత్సల్య బాలల రక్షణ, సంక్షేమం, భద్రతకు కేంద్ర పథకం.
  • ప్రతి బిడ్డకు ₹4000 ఆర్థిక సహాయం, వసతి, విద్య అందిస్తారు.
  • జిల్లా బాలల రక్షణ విభాగాలు, కమిటీలు పథకాన్ని అమలు చేస్తాయి.
  • తల్లిదండ్రులు కోల్పోయిన, నిరాదరణకు గురైన పిల్లలు దీనికి అర్హులు.

Mission Vatsalya: మిషన్ వాత్సల్య (Mission Vatsalya) అనేది భారతదేశంలోని పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తోన్న ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. గతంలోని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకానికి మార్పుచేర్పులు చేసి 2021-22 నుంచి దీనిని "మిషన్ వాత్సల్య"గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తుంది.  

ఆంధ్రప్రదేశ్‌లో పథకం అమలు విధానం

రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా బాలల రక్షణ విభాగం (District Child Protection Unit) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ పథకం పర్యవేక్షిస్తుంటారు.  

1. ఆర్థిక సహాయం  

ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన పిల్లల చదువు నిరంతరాయంగా సాగడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. గతంలో ఈ సహాయం తక్కువగా ఉండేది, కానీ మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 

Also Read: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!

2. బాలల సదనాలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే చిల్డ్రన్ హోమ్స్, అబ్జర్వేషన్ హోమ్స్ ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ చేరిన పిల్లలకు ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు, వైద్య సహాయం అందిస్తారు. ఏపీలో ఈ హోమ్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు పనిచేస్తాయి.

3. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు & జువెనైల్ జస్టిస్ బోర్డులు 

ఏపీలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయి. రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారిని హోమ్‌లకు పంపాలా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వాలా అనేది ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో పడిన బాల నేరస్థుల కౌన్సెలింగ్, సంస్కరణల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేస్తాయి. 

Also Read: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు

లబ్ధిదారులు ఎవరు? 

  • కోవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యత
  • భర్త చనిపోయి లేదా వదిలేసి, ఆర్థికంగా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న మహిళల పిల్లలు 
  • తల్లిదండ్రులు హెచ్‌ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడుతూ పిల్లల పోషణ చూసుకోలేని కుటుంబాలు
  • ఇటుక బట్టీలు, హోటళ్లు, ఇతర పనుల నుంచి రక్షించిన బాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో తిరిగే అనాథ పిల్లలు

దరఖాస్తు చేసుకునే విధానం  

  • స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త లేదా సూపర్‌వైజర్ ద్వారా ప్రాథమిక సమాచారం సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఆఫీసులో అప్లికేషన్ సమర్పించాలి.
  • జిల్లా కేంద్రంలో ఉండే జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో నేరుగా సంప్రదించి, అవసరమైన పత్రాలు (ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

Frequently Asked Questions

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?

ఇది కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం అమలు చేస్తున్న పథకం. 2021-22 నుండి దీనిని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకం నుండి మార్చారు.

ఈ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు?

అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?

కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆర్థికంగా పిల్లలను పోషించలేని మహిళల పిల్లలు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. రక్షించబడిన బాలలు, అనాథ పిల్లలు కూడా లబ్ధిదారులు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అంగన్‌వాడీ కార్యకర్త ద్వారా, సీడీపీఓ ఆఫీసులో లేదా నేరుగా జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget