అన్వేషించండి

Minister RK Roja: తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్: మంత్రి రోజా

Minister RK Roja: రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పవన్ కల్యాణ్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

Minister RK Roja: తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించి తనను నమ్మిన అభిమానులను జనసేనాని మోసం చేశారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జైలుకు పరామర్శించేందుకని వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. జగన్ ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కల్యాణ్ ఓడిపోయారని విమర్శించారు. మిగిలిన పార్టీల జెండాలు మోసే కూలాగా పవన్ మారిపోయారని ఎద్దేవా చేశారు. తండ్రి వైెస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పయనిస్తూ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. పవన్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని సూచించారు. అమిత్ షాకు కంప్లైంట్ చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నాడని.. పవన్ దేనిలోనైనా సక్సెస్ అయ్యారా అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు. యుద్ధానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కనీసం 10 చోట్ల అయినా పవన్ కల్యాణ్ కు అభ్యర్థులు ఉన్నారా అని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తారని అన్నారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికినా వీరికి సిగ్గు లేదని మండిపడ్డారు. టీడీపీ సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నారని, అవినీతికి పాల్పడితే అరెస్టు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని, ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదని అర్థమైందని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ గురించి వీరెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. చంద్రబాబు సంతకాలు పెట్టారో లేదో సీఐడీ ఆఫీసుకు వెళ్తే చూపిస్తారని అన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో 13 చోట్ల సంతకాలు పెట్టారా లేదా, సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకోలేదని చెప్పిందా లేదా, బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారా లేదా, అధికారులు వద్దని చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారా లేదా ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని ఆర్కే రోజా హెచ్చరించారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తామన్నారు. సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ అని, సుమన్ బోస్ మాజీ ఎండీ ఎందుకయ్యారని ఆర్కే రోజా ప్రశ్నించారు. సీమన్స్ సంస్థ కోర్టులోనే ఆ వ్యక్తి తమకు తెలియకుండా చేశాడమని కోర్టులోనే చెప్పినట్లు ఆర్కే రోజా తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget