అన్వేషించండి

Minister Botsa: రెండు నెలల్లో సీపీఎస్ కు ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తాం - మంత్రి బొత్స 

Minister Botsa: సీపీఎస్ ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పాత పెన్షన్ లు ఇవ్వలేమని, వచ్చే నెల నుంచి ఆర్టీసీకి కొత్త జీతాలు ఇస్తామని స్పష్టం చేశారు.

Minister Botsa: రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పసిర్థితిలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం వాస్తవమే అన్నారు. ప్రత్యామ్నాయ పథకానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఇది రెండు నెలల్లో కొలిక్కి వస్తుందని వివరించారు. శనివారం విజయనగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నాగులో వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానంలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ... ఎవరికీ ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు.. 
వచ్చే మూడు నెలల్లో విద్యా శాఖలో ప్రమోషన్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఎంఈఓల నియామకం చేపట్టామన్నారు. పీఆర్సీతో కలిసి జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల మంది ఉద్యోగుల విషయంలో సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు చర్చలు జరిపామన్నారు. కేంద్రం ఆదేశించిన విధంగా వారికి ఓపీఎస్ అమలు చేయాలా లేకా సీపీఎస్ అమలు చేయాలా అన్నది ఆర్థిక శాఖ ద్వారా కూడా చర్చ జరిగిందన్నారు. ఈ విషయంపై ఈ నెల చివర్లో స్పష్టత వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. అయితే ఈ సమావేశంలో మొదటి ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్, సూర్య నారాయణ, కార్యదర్శి జి. అస్కారరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరినీ దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

జీపీఎస్ అమలుకు ఉద్యోగులను ఒప్పించాలని.. 
ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను ఎలాగైనా ఒప్పించి జీపీఎస్‌ను అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిల్లు కూడా రెడీ చేశారని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తీసుకోవచ్చని కూడా అధికారవర్గాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ మరో రెండు నెలల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల కల్లా సీపీఎస్ సమస్యకు ఏదో ఓ పరిష్కారం చూపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ నేరుగా ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు. ఉద్యోగ నేతలతో కలిసి ఉద్యమాలు కూడా చేశారు. అందుకే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. 

మాకు ఇగో లేదు... 
ఉపాధ్యాయ సంఘాల నేతలతో రెండు అంశాలపై ముఖ్యంగా చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే సీఎం జగన్ ఉద్దేశమన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమేనని కొత్తగా పెట్టింది ఏమీ లేదని మంత్రి బొత్స తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తున్నామన్నారు.  తమకు ఇగో లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే తమ తపన అని బొత్స అన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget