అన్వేషించండి

Botsa On CPS : రెండు నెలల్లో సీపీఎస్ సమస్యకు పరిష్కారం - ఉద్యోగులకు మంత్రి బొత్స హామీ !

రెండు నెలల్లో సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అందర్నీ మెప్పించేలా నిర్ణయం ఉంటుందన్నారు.

Botsa On CPS :  ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)పై ప్రభుత్వ నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  ''ఎన్నికల ముందు మా పార్టీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్‌ ఒకటి. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. సీపీఎస్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుంది. మా నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తాం. ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆఖరికల్లా పరిష్కరిస్తాం'' అని బొత్స  మీడయా ప్రతినిధులకు తెలిపారు. అంటే సమస్య మరో రెండు నెలల తర్వాతే పరిష్కరంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఉద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. మిలియన్ మార్చ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగిపోయారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు రెండు  నెలల గడువు పెట్టడంతో  ఉద్యోగ సంఘాలు కూడా ఎదురు చూసే అవకాశం ఉంది. 

సీపీఎస్ రద్దు చేసే ప్రశ్నే లేదని ఇప్పటికే తేల్చేసిన బొత్స

వాస్తవానికి సీపీఎస్ ను రద్దు చేసే అవకాశమే లేదని.. తాము తొందరపడి.. అవగాహన లేకుండా హామీ ఇచ్చామని నిర్మోహమాటంగానే మంత్రులు, సలహాదారులు చెబుతున్నారు. భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అందుకే సీపీఎస్‌ను రద్దు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు ప్రయోజన ంకలిగే జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని.. నెలకు కనిష్టంగా రూ. పదివేల పెన్షన్ అందిస్తామనే ప్రతిపాదన పెట్టారు. దీనపై ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు అంగీకరించలేదు.  సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని హామీ ఇచ్చినట్లుగా తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.  

జీపీఎస్ అమలుకు ప్రభుత్వ ఉద్యోగులను ఒప్పించాలనే ప్రయత్నం 

ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను ఎలాగైనా ఒప్పించి జీపీఎస్‌ను అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిల్లు కూడా రెడీ చేశారని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తీసుకోవచ్చని కూడా అధికారవర్గాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ మరో రెండు నెలల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల కల్లా సీపీఎస్ సమస్యకు ఏదో ఓ పరిష్కారం చూపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ నేరుగా ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు. ఉద్యోగ నేతలతో కలిసి ఉద్యమాలు కూడా చేశారు. అందుకే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. 

రెండు నెలల్లో కీలక నిర్ణయం

మంత్రి బొత్స సత్యనారాయణ సీపీఎస్‌పై సీఎం జగన్ నియమించిన మంత్రివర్గ సబ్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఉద్యోగ సంఘాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. రెండు విడతలుగా తన  ఇంట్లో నిర్వహించిన చర్చలు అనధికారికమేనని తాను చొరవ తీసుకున్నానని ప్రకటించారు. ఈ రెండు నెలల్లో ఆయన సమస్య పరిష్కారానికి మరింత చొరవ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget