అన్వేషించండి

Where Is Botsa Sajjala : అంత పెద్ద పెట్టుబడుల సదస్సులో బొత్స ఎక్కడ..? సజ్జల కూడా కనబడలేదేమి..?

పెట్టుబడుల సదస్సుకు మంత్రి బొత్స, సలహాదారు సజ్జల హాజరు కాలేదు. దీనికి కారణం ఏమిటి ?


Where Is Botsa Sajjala : వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వం నిర్వహించిన మొట్టమొదటి పెట్టుబడుల సదస్సు. అది కూడా భారీ ఎత్తున నిర్వహించిన   గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు.   విశాఖలోనే జరుగుతున్న ఈ సదస్సులో ఉత్తరాంధ్ర ముఖ్యనేత బొత్స సత్యనారాయణ కనబడలేదు ఎందుకు..? ప్రభుత్వంలో నెంబర్ -2 సజ్జల కూడా లేరు. ఈ అంశంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అందరూ కనిపించారు.. ఇద్దరు తప్ప ! 

విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ శనివారం ముగిసింది. రెండు రోజుల పాటు.. విశాఖలో అట్టహాసంగా జరిపిన ఈ సదస్సు విజయవంతం అయిందని ప్రభుత్వం తెలిపింది. . ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు పోట్టెత్తినట్లు ప్రకటించుకుంది. ఈ సదస్సు కోసం ఎన్నో రోజులుగా వైఎస్సార్పీపీ ప్రభుత్వం సన్నాహకాలు చేసింది. దీనిని విజయవంతం చేసే పనిలో తీరికలేనంత బిజీగా ఉన్నందునే దావోస్ కూడా వెళ్లడం లేదని పరిశ్రమల మంత్రి అమరనాథ్ ప్రకటించారు. అంతా బానే ఉంది.. సదస్సు విజయవంతం అయింది.రూ.  13 లక్షల కోట్లు వచ్చాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారగణం అంతా వచ్చారు కానీ ముఖ్యమైన వ్యక్తులు మాత్రం మిస్ అయ్యారు. 

అమరావతిలోనే ఉన్న  బొత్స, సజ్జల !

ప్రభుత్వంలో నెంబర్ -2 గా ఉన్నటువంటి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సదస్సు ప్రాంగణంలో ఎక్కడా కనిపించలేదు. ఆయన సలహాదారు కాబట్టి ముఖ్యమంత్రి అప్పగించిన ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. కానీ ఉత్తరాంధ్రకే చెందినటువంటి సీనియర్ రాజకీయ నేత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి బొత్ససత్యనారాయణ తమ ప్రాంతంలో అంతపెద్ద సదస్సు జరుగుతుంటే హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సదస్సు తొలిరోజు.. ఉత్తరాంధ్రకే చెందిన స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ఇలా చాలా మంది నేతలు హాజరయ్యారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం కనిపించలేదు.

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్న బొత్స ! 

సదస్సు ప్రాంగణంలో బొత్స లేకపోవడం గురించి కొంతమంది పార్టీ నేతలు.. చర్చించుకున్నారు. అయితే ప్రభుత్వంపై ఉద్యోగసంఘాలు ఈ మధ్య మళ్లీ స్వరం పెంచాయి.  తమకు సమయానికి జీతాలు రావడం లేదని.. తమ ఫించను సొమ్మును దారి మళ్లించారని... వాళ్లంతా గరంగరం అవుతున్నారు. ఇంతకు ముందు పీఆర్సీ విషయంలో ఆందోళనలు చేసినప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ముఖ్యమైన సభ్యులు. ఇప్పుడు కూడా ఉద్యోగుల విషయాన్ని పరిష్కరించడం కోసమే వాళ్లు అమరావతిలో ఉండిపోయారని  ఓ నేత చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి చూపిస్తుండటం.. ఏకంగా గవర్నర్ ను కలవడం.. కలిస్తే తప్పేంటి అని ప్రకటించడం వంటి వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. పైగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగల సంఘాల నేతలు కూడా ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుండటంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. పైగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని సమస్య పరిష్కారం కాకుంటే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వాళ్లు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. పెట్టుబడుల సదస్సు జరిగే ఇలాంటి తరుణంలో ఉద్యోగుల నుంచి ఏదైనా ఊహించనిది జరిగితే.. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే సీనియర్లు అయిన సజ్జల, బొత్సకు ఉద్యోగుల బాధ్యత అప్పగించినట్లుగా అర్థమవుతోంది. రెండు రోజులుగా వాళ్లు ఈ పనిమీదనే ఉన్నారని అంటున్నారు. 

అసలు కారణం అది కాదంటున్న సీనియర్ బ్యూరోక్రాట్స్ ! 

అయితే వీళ్లిద్దరూ నిజంగానే ఉద్యోగ సంఘాల సమస్య పరిష్కరించేందుకే ఉన్నారా మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ముఖ్యమైన అధికారిని అడిగినప్పుడు ముఖ్యమంత్రి వాళ్లకి ఓ “ముఖ్యమైన” పని అప్పగించారని.. అది ఉద్యోగుల సంఘాల విషయం కాదని చెప్పారు.  అంత “ముఖ్యమైన” పని ఏంటో మరి..!?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Balakrishna: కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Embed widget