అన్వేషించండి

Chandrababu Arrest Live Updates: విజయవాడ కోర్టులో చంద్రబాబు, కొనసాగుతున్న వాదనలు - కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

నంద్యాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌ చుట్టూ పోలీసులు మోహరించారు

Key Events
Tension in Nandya - Police  trying to arrest  tdp Chief Chandrababu stayed - TDP leaders are blocking it Chandrababu Arrest Live Updates: విజయవాడ కోర్టులో చంద్రబాబు, కొనసాగుతున్న వాదనలు - కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
చంద్రబాబు అరెస్టు

Background

నంద్యాలో అర్థరాత్రి కలకలం రేగింది. చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో టీడీపీ నాయకుల హడావుడి మామూలుగా లేదు. నంద్యాలలో ప్రసంగం తర్వాత నేరుగా ఆర్కే ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన బస చేసిన ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ మేర టీడీపీ శ్రేణులు, నాయకులు మోహరించి రక్షణగా నిలుస్తున్నారని ప్రచారం నడుస్తోంది. 

ఏ క్షణమైనా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన షెడ్యూల్ ప్రకారమే సభల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడి బస చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఆయన అరెస్టు కోసం అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసు బెటాలియన్‌లు బయల్దేరారనే వార్త వైరల్‌గా మారింది. 

చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు బయల్దేరారు అనే ప్రచారంతో టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఆయనకు రక్షణగా నిలిచేందుకు నంద్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న కేడర్‌ తరలి వస్తున్నారు. ఆయన బస చేసే ప్రాంతానికి సమీపంలో ఉన్న నాయకులంతా తమ వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు. 

ఒక్కసారిగా టీడీపీ కేడర్‌ నాయకులు ఇలా చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ చుట్టూ మోహరించడంతో చాలా మందిలో అరెస్టు అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలాంటిది ఏమీ లేదని పోలీసులు, ఓ వర్గం టీడీపీ లీడర్లు చెబుతున్నప్పటికీ, వేకువ జాములోపు అరెస్టు ఖాయమంటున్నారు నంద్యాల, అనంతపురంలో ఉన్న టీడీపీ లీడర్లు. 

 

శుక్రవారం ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల రాజ్‌ థియేటర్‌ సెంటర్‌లో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  పార్టీ తరఫున సర్వే నిర్వహించిన తర్వాతే సీట్ల అంశాన్ని తేలుస్తామని ముందే ప్రకటించే ఛాన్స్‌ మాత్రం లేదన్నారు. అందరితో చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. తన స్థానంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీట్లకు ఇది వర్తిస్తుందని వివరించారు. 

తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలకు జగన్‌ పేరు పెట్టుకుంటున్నారని తాము ప్రారంభించిన వాటినే మళ్లీ మళ్లీ ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలతో ప్రజలకు అల్లాడిపోతున్నారని.... చార్జీలు పెంచినా విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదున్నారు చంద్రబాబు. 

బహిరంగ సభకు ముందు చంద్రబాబు.. మహిళా శక్తి హామీలపై మహిళలతో మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా ఇప్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని వివరించారు. తిరుపతిలో మహిళా యూనివర్శిటీకి ఆధ్యుడు కూడా ఆయనేనన్నారు. మహిళలు పురుషులతో పోటీ పడి ఆర్థికంగా ఎదగాలనే డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. తర్వాత దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామని తెలిపారు. 

వైఎస్ఆర్‌సీపీలో మాత్రం మహిళలకు వేధింపులు ఎక్కువ అయ్యాయని... లేని దిశా చట్టం  చూపించి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు చంద్రాబుబ. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు ఆ డబ్బులతోనే పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఆరోగ్యాలు పాడుచేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి వ్యాపారంతో సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

09:38 AM (IST)  •  10 Sep 2023

Chandrababu News: రిమాండ్ రిపోర్టు వాదనలకు అవకాశం కల్పించిన జడ్జి

చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. ఈ మేరకు నోటీసు ఇచ్చారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.

09:33 AM (IST)  •  10 Sep 2023

Chandrababu Latest News: కోర్టులో వాదన వినిపించిన చంద్రబాబు

విజయవాడ ఏసీబీ కోర్టులో గత మూడు గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించి సంస్థ తరపు న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. అనంతరం కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. స్కిల్‌ డెవలప్ మెండ్ స్కామ్‌తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
Advertisement

వీడియోలు

PM Modi Tweet Asia Cup Final | ఆసియా కప్ గెలవడంపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
చిట్టి రోబో లాంటి ఫ్రెండ్..  టెక్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న ఏజెంటిక్ AI
India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో కాంట్ర‌వ‌ర్సీ
India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Telugu TV Movies Today: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ to విజయ్ ‘జిల్లా’, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ వరకు - ఈ సోమవారం (సెప్టెంబర్ 29) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ to విజయ్ ‘జిల్లా’, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ వరకు - ఈ సోమవారం (సెప్టెంబర్ 29) టీవీలలో వచ్చే సినిమాలివే
Navaratri Day 8: నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు మూలా నక్షత్రం రోజు శ్రీసరస్వతి దేవి అలంకారం -  పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు మూలా నక్షత్రం రోజు శ్రీసరస్వతి దేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Andhra Pradesh News: అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
Embed widget