By: ABP Desam | Updated at : 25 Apr 2023 11:33 AM (IST)
తాడిపత్రి మున్సిపాలిటీలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి- రెండో రోజుకు చేరిన నిరసన
తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతన్న అక్రమాలపై పోరు సాగిస్తున్న ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండోరోజు నిరసన బాట పట్టారు. సోమవారం నుంచి కొనసాగుతున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తాడిపత్రి మున్సిపల్ అధికారులు అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిరసన చేపట్టారు. సోమవారం మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు యత్నించిన జేసీ వర్గీయులను పోలీసులు అడ్డుకోడం నిన్న ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఆయన మాత్రం కార్యాలయంలోనే ఉంటూ దీక్ష కొనసాగిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు.
రాత్రి తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోనే బస చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయం అక్కడే స్నానం చేశారు. ఆయనకు పలువురు తెలుగుదేశం పార్టీ లీడర్లు సపోర్ట్ చేశారు. యాడికి, పెద్దపప్పూరు, మండలాలకు చెందిన టీడీపీ లీడర్లు వచ్చి సంఘీభావం తెలిపారు.
రాత్రియితేనేమి పగలయితే నేమి
అన్యాయాన్ని ప్రశ్నించుటకు ఎపుడైతే నేమి!!
మునిసిపల్ అక్రమాలను నిగ్గు తెల్చే వరకు తగ్గే ప్రసక్తే లేదు pic.twitter.com/JO1OV8ETxU— JC Prabhakar Reddy (@JCPRTDP) April 24, 2023
ఇదేమి ఇదేమి రాజ్యం
— JC Prabhakar Reddy (@JCPRTDP) April 24, 2023
దొంగల రాజ్యం - దోపిడి రాజ్యం
ఇసుక అక్రమ రవాణా నివారించాల్సిన వారు ,కోర్టు ద్వారా నివారించిన నన్ను గృహ నిర్భందం చేయడం ఏమిటి అన్నది అంతుచిక్కని ప్రశ్న!
పోనీ ఇసుక తవ్వకాలను వారు అడ్డుకుంటారా అదీ లేదు ! pic.twitter.com/HM4JXvSwV8
మున్సిపాలిటీలో డీజీల్, టైర్ల చోరీకి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ చెప్పినట్టు వింటూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ తన వైఖరి మార్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?