అన్వేషించండి

Paritala Sunitha: పిల్లల్ని పస్తులు పెడితే, మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్

పిల్లల్ని పస్తులు పెడితే మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది అంటూ పరిటాల ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను హెచ్చరించారు. బీసీ వసతి గృహంలో పిల్లలకు భోజనం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులను పస్తులు ఉంచి ఇబ్బందులకు గురి చేస్తే.. మీరు కూడా పస్తులు ఉంటారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో గణతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులు ఆకలితో అలమటించిన విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రత్యక్ష్యంగా ఆకస్మిక తనిఖీ చేసి సంఘటనపై తీవ్రంగా స్పందించారు. బీసీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల్ని పరిశీలించారు. మొత్తం వసతి గృహంలో ఉన్న సౌకర్యాలను, విద్యార్థులుండే ప్రతి గదిని పరిశీలించారు. టాయిలెట్స్, వంటశాలను కూడా చూశారు.

అనంతరం విద్యార్థులను అడిగి అన్ని అంశాలను తెలుసుకున్నారు. అలాగే స్థానికులతో కూడా సమావేశమై పలు అంశాలు తెలుసుకున్నారు. బీసీ వసతి గృహం వార్డెన్ నారాయణస్వామి హాస్టల్ కి  సరిగా రాడని.. పిల్లలకు వచ్చే బడ్జెట్ ను సరిగా ఖర్చు చేయడం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీతకు వారు ఫిర్యాదులు చేశారు. తాగునీరు గొళ్లపల్లి నుంచి వస్తాయని.. స్నానానికి బాత్ రూమ్స్ సమస్య ఉందన్నారు. అలాగే టాయిలెట్స్ లేక నిచ్చెన వేసుకొని కాంపౌండ్ బయటకు వెళ్తామని విద్యార్థులన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. బీసీ వసతి గృహంలో ఆదివారం జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. వార్డెన్ పిల్లల్ని ఆకలితో ఉండేలా చేయడం సరి కాదన్నారు. ఇంత నిర్లక్ష్యం వహించిన వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు. ఒక విద్యార్థికి ఒక నెలకు 1400 ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వార్డెన్ సరుకులు కొనుగోలు చేసి మెను ప్రకారం టిఫిన్, భోజనం చేయించాలన్నారు. వార్డెన్ లేనప్పుడు మరొక వార్డెన్ ఇన్ ఛార్జిగా ఉండాలి.. లేదా పిల్లలకు ఎలాంటి సమస్య రాకుండా వంట వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. అలా కాకుండా నారాయణ స్వామి నిర్లక్ష్యం వహించారన్నారు. వసతి గృహంలో భవనం కూడా దెబ్బతిందని చాలా చోట్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చవుతుందని దీనిపై ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు విజ్ఞప్తి చేశామని... మరోసారి దీనిపై మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తామన్నారు.


Paritala Sunitha: పిల్లల్ని పస్తులు పెడితే, మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్

జిల్లా కలెక్టర్ తాత్కాలిక మరమ్మతులకు 10లక్షల వరకు మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న టాయిలెట్స్, ఫ్యాన్ల మరమ్మతులను వెంటనే చేయిస్తామన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతి గృహంలో లైట్లు సరిగా పని చేయలేదని చూసి వెంటనే లైట్ల సమస్య పరిష్కారానికి కొత్త లైట్స్ తెప్పించాలని స్థానిక మండల కన్వీనర్ కు సూచించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని.. ఖర్చు విషయంలో వెనుకాడటం లేదన్నారు.

తాజాగా చెన్నేకొత్తపల్లి ఎస్సీ బాలికల వసతి గృహం మరమ్మతులకు 33.80లక్షలు, ఎస్సీ బాలుర వసతి గృహానికి 32.40లక్షలు మంజూరు చేసినట్టు వివరించారు. వీటితో భవనాల మరమ్మతులు చేపడతామన్నారు. త్వరలో బీసీ వసతి గృహానికి నిధులు వస్తాయన్నారు. ప్రభుత్వం అందించాల్సినవన్నీ ఇస్తున్నా.. వార్డెన్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం సరికాదన్నారు. ఇక నుంచి ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget