అన్వేషించండి

Kurnool bus accident update: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకమలుపు - ముందే బైక్ ప్రమాదం - డ్రైవర్ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో

Kurnool bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక విషయాలను డ్రైవర్లు చెప్పారు. బైక్ ప్రమాదం ముందే జరిగిందని..రోడ్డుపై ఉన్న బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లిందని తెలిపారు.

Kurnool bus accident Drivers Version: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారు కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బస్సు.. బైక్ ను ఢీకొట్టలేదని.. బస్సు అక్కడికి రాక ముందే బైక్ యాక్సిడెంట్ అయిందని డ్రైవర్లు పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.  రోడ్ పై బైక్ పడి ఉందని ..భారీ వర్షం కారణంగా సరిగ్గా చూసుకోలేదని.. ఆ సమయంలో బైక్ పైకి బస్సు ఎక్కిందని.. ఈడ్చుకుని వెళ్లిందన్నారు. బైక్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి స్పార్క్ వచ్చి మంటలు అంటున్నాయని డ్రైవర్లు తెలిపారు.                 

డ్రైవర్లు తెలిపిన ప్రకారం.. ఆ బైక్ యాక్సిడెంట్ అంతకు ముందు జరిగింది. కానీ ఆ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు.  దాంతో బైక్ నడిపిన శివకుమార్ రోడ్డు పక్కన పడిపోయారు. బైక్ రోడ్డు మీద పడిపోయింది. ఆ బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు.  బైక్ రైడర్ కూడా మరణించడంతో పోలీసులు అసలేం జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెలికి తీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.                            

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల్ని సంఘటనా స్థలానికి పంపించి.. సహాయ  కార్యక్రమాలు చేపడుతోంది. బస్సులో ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు  జారీచేసింది. మరోవైపు గాయపడిన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. కోలుకున్న వారిని బెంగళూరుకు పంపే ఏర్పాట్లు చేశారు.               

బస్సులో ఉండిపోయిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కోసం డీఎన్ఏలు సేకరించారు. ఆ మృతదేహాల ఆనవాళ్లను ఆస్పత్రికి తరలించారు. బస్సును రోడ్డు నుంచి పక్కకు జరిపే  ప్రయత్నంలోనూ మరో ప్రమాదం జరిగింది.  బస్సును లాగుతున్న  క్రేన్ ఒక్క సారిగా కిందకు పడిపోవడంతో..  క్రేన్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలయ్యాయి. 

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న  మల్టీ యాక్సిల్ బస్సు..  కర్నూలు నగరానికి సమీపంలోని చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురై  పూర్తిగా తగులబడిపోయింది. 40మందికిపైగా ఉన్న బస్సులో సగం మందే ప్రాణాలు కాపాడుకోగలిగారు. . ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొందరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  స్లీపర్‌ బస్సు సీట్లలోనే 20మంది సజీవంగా దహనం అయిపోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు   దారి తీసింది.    

బస్సుల డిజైన్, వేగ నియంత్రణ, ఫిట్‌నెస్, ఎస్కేప్ ప్లాన్ వంటి విషయాలపై చర్చకు దారితీస్తున్నాయి. బస్సుల్లో అగ్ని కీలలు రాగానే క్షణాల్లోనే కాలిపోతున్నాయని బస్సుల తయారీకి వాడుతున్న మెటీరియల్ మంటలను వేగంగా వ్యాప్తి చేస్తోందని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని నిపుణులు వ్యాఖ్యనిస్తున్నారు.             

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Advertisement

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget