News
News
వీడియోలు ఆటలు
X

బుధవారం అనంతపురంలో జగన్ పర్యటన- వసతి దీవెన డబ్బులు విడుదల

వాయిదా పడుతూ వస్తున్న వసతి దీవెన నిధుల విడుదల బుధవారం జరగనుంది. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

FOLLOW US: 
Share:

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో బుధవారం పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. 
వారం రోజుల క్రితం ఈ వసతి దీవెన నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఖజానాలో నిధుల కొరత అంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు షెడ్యూల్ ఖరారు చేసింది ప్రభుత్వం. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు సీఎం జగన్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పది గంటలకు అనంతపురం జిల్లా నార్పలలోని ప్రభుత్వం బాలుర పాఠశాలకు చేరుకుంటారు. 10.20కి చేరుకోనున్న సీఎం జగన్ 10.30 వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాతారు. 
పదిన్నర తర్వాత నార్పల క్రాస్  వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోగ్యాలరీని సందర్శించారు. 11 గంటలకు సభా వేదికపై చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. 
11గంటలకు వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఉన్న విద్యార్థులతో జగన్ మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత వసతి దీవెన నిదులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు అక్కడ నుంచి బయల్దేరి 1.40 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 
ఈ కార్యక్రమానికి 1200 మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ గౌతమి, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే సీఎం పర్యటన రూట్ పరిశీలించినట్టు తెలిపారు. 

 

Published at : 25 Apr 2023 02:55 PM (IST) Tags: ANDHRA PRADESH Anantapuram CM Jagan jagananna Vasati Deevena Narpala

సంబంధిత కథనాలు

Nara Lokesh Padayatra: కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత

Nara Lokesh Padayatra: కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా