అన్వేషించండి

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

మంత్రి భార్యతో బినామీ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తూ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రూ.50 లక్షలు ఎలా చెల్లింపులు చేశారు? ఇన్‌కం సోర్స్ ఏంటి? అని అడిగింది

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీశాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసులు నెల రోజుల క్రితమే అందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధిత చట్టం-1988’ (Prohibition of Benami Property Transactions Act) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా పరిధిలోని ఆస్పరి మండలం ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల సమీపంలో మంత్రి దాదాపు 180 ఎకరాల వరకూ తన కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేశారు. 2020 మార్చి 2వ తేదీన ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందులో ఆయన భార్య రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు ఉంది. మొత్తం రూ.52.42 లక్షలకు ఆ భూములు కొనగా ఒక్కో ఎకరా రూ.1.75 లక్షలు పడిందని తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం నగదు ఎక్కడిది, ఎలా చెల్లింపులు చేశారో చెప్పాలని హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసు నుంచి మంత్రి భార్యకు నోటీసులు అందాయి. అంతేకాకుండా సదరు 30.83 ఎకరాలను కూడా అటాచ్‌ చేశారు.

బినామీ వ్యవహారమే...

మంత్రి భార్యతో బినామీ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తూ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రూ.50 లక్షలు ఎలా చెల్లింపులు చేశారు? ఇన్‌కం సోర్స్ ఏంటి? అని అడిగింది. లెక్కల్లో చూపని ఆదాయం నుంచే ఈ చెల్లింపులు చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఐటీ అధికారులు. అలాగే ఆస్పరి గ్రామంలో ఇతినా మంజునాథ్‌ నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రి జయరాం స్వయంగా మీడియాకు వెల్లడించారని కూడా నోటీసులో వెల్లడించింది. ‘‘డాక్యుమెంట్‌ నంబరు 552/2020లో నమోదు చేసిన విక్రయ లావాదేవీలు పీబీపీటీ చట్టం (Prohibition of Benami Property Transactions Act) లోని సెక్షన్‌ 2(9)(ఏ) ప్రకారం బినామీ లావాదేవీలని తెలుస్తోంది. మంత్రి జయరాంకు చెందిన రహస్య ఆదాయ వనరుల నుంచే ఆ చెల్లింపులు చేశారని తెలుస్తోంది. రేణుకమ్మ పేరుతో కొనుగోలు చేసిన 30.83 ఎకరాలను ఈ నోటీసు జారీ చేసిన రోజు నుంచి 90 రోజుల పాటు తాత్కాలికంగా అటాచ్‌ చేస్తున్నాం’’ అని ఐటీ అధికారులు పేర్కొన్నారు.

మంత్రి స్పందన ఇదీ

తాము ఆ భూములు కొన్నట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు. తమది ఉమ్మడి కుటుంబం అని, దాదాపు వారసత్వంగా వంద ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆ పంటల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం, అప్పులు చేసి ఆ భూములు కొన్నామని వివరణ ఇచ్చారు. 52 చెల్లించి 30 ఎకరాలు నేను కొనలేనా? మేం ఏ అక్రమాలూ చేయలేదు. ఎవరినుంచి లాక్కోలేదు. బినామీ అనేది లేనే లేదు. నా తమ్ముడి భార్య, మరో తమ్ముడి భార్య పేరున పొలం తీసుకున్నాం. అంతే, ఐటీ అధికారుల నోటీసులు అందలేదు. ఒకవేళ మమ్మల్ని వివరణ అడిగితే అన్ని ఆధారాలు చూపిస్తాం.’’ అని చెప్పారు.

ఈ భూములు బెంగళూరుకు చెందిన ఇతినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది. ఆ సంస్థ 2006లో ఈ భూములు కొనుగోలు చేయగా.. 2020 మార్చి 2వ తేదీన మంత్రి సతీమణి పేరుతో 30.83 ఎకరాలు, ఆమె తోడికోడళ్ల పేరుతో 149.17ఎకరాల రిజిస్ట్రేషన్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తం 180 ఎకరాలు చేతులు మారగా.. మంత్రి సతీమణి పేరుపై ఉన్న 30 ఎకరాల విషయంలో నోటీసులు అందాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget