అన్వేషించండి

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

మంత్రి భార్యతో బినామీ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తూ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రూ.50 లక్షలు ఎలా చెల్లింపులు చేశారు? ఇన్‌కం సోర్స్ ఏంటి? అని అడిగింది

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీశాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసులు నెల రోజుల క్రితమే అందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధిత చట్టం-1988’ (Prohibition of Benami Property Transactions Act) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా పరిధిలోని ఆస్పరి మండలం ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల సమీపంలో మంత్రి దాదాపు 180 ఎకరాల వరకూ తన కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేశారు. 2020 మార్చి 2వ తేదీన ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందులో ఆయన భార్య రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు ఉంది. మొత్తం రూ.52.42 లక్షలకు ఆ భూములు కొనగా ఒక్కో ఎకరా రూ.1.75 లక్షలు పడిందని తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం నగదు ఎక్కడిది, ఎలా చెల్లింపులు చేశారో చెప్పాలని హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసు నుంచి మంత్రి భార్యకు నోటీసులు అందాయి. అంతేకాకుండా సదరు 30.83 ఎకరాలను కూడా అటాచ్‌ చేశారు.

బినామీ వ్యవహారమే...

మంత్రి భార్యతో బినామీ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తూ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రూ.50 లక్షలు ఎలా చెల్లింపులు చేశారు? ఇన్‌కం సోర్స్ ఏంటి? అని అడిగింది. లెక్కల్లో చూపని ఆదాయం నుంచే ఈ చెల్లింపులు చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఐటీ అధికారులు. అలాగే ఆస్పరి గ్రామంలో ఇతినా మంజునాథ్‌ నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రి జయరాం స్వయంగా మీడియాకు వెల్లడించారని కూడా నోటీసులో వెల్లడించింది. ‘‘డాక్యుమెంట్‌ నంబరు 552/2020లో నమోదు చేసిన విక్రయ లావాదేవీలు పీబీపీటీ చట్టం (Prohibition of Benami Property Transactions Act) లోని సెక్షన్‌ 2(9)(ఏ) ప్రకారం బినామీ లావాదేవీలని తెలుస్తోంది. మంత్రి జయరాంకు చెందిన రహస్య ఆదాయ వనరుల నుంచే ఆ చెల్లింపులు చేశారని తెలుస్తోంది. రేణుకమ్మ పేరుతో కొనుగోలు చేసిన 30.83 ఎకరాలను ఈ నోటీసు జారీ చేసిన రోజు నుంచి 90 రోజుల పాటు తాత్కాలికంగా అటాచ్‌ చేస్తున్నాం’’ అని ఐటీ అధికారులు పేర్కొన్నారు.

మంత్రి స్పందన ఇదీ

తాము ఆ భూములు కొన్నట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు. తమది ఉమ్మడి కుటుంబం అని, దాదాపు వారసత్వంగా వంద ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆ పంటల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం, అప్పులు చేసి ఆ భూములు కొన్నామని వివరణ ఇచ్చారు. 52 చెల్లించి 30 ఎకరాలు నేను కొనలేనా? మేం ఏ అక్రమాలూ చేయలేదు. ఎవరినుంచి లాక్కోలేదు. బినామీ అనేది లేనే లేదు. నా తమ్ముడి భార్య, మరో తమ్ముడి భార్య పేరున పొలం తీసుకున్నాం. అంతే, ఐటీ అధికారుల నోటీసులు అందలేదు. ఒకవేళ మమ్మల్ని వివరణ అడిగితే అన్ని ఆధారాలు చూపిస్తాం.’’ అని చెప్పారు.

ఈ భూములు బెంగళూరుకు చెందిన ఇతినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది. ఆ సంస్థ 2006లో ఈ భూములు కొనుగోలు చేయగా.. 2020 మార్చి 2వ తేదీన మంత్రి సతీమణి పేరుతో 30.83 ఎకరాలు, ఆమె తోడికోడళ్ల పేరుతో 149.17ఎకరాల రిజిస్ట్రేషన్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తం 180 ఎకరాలు చేతులు మారగా.. మంత్రి సతీమణి పేరుపై ఉన్న 30 ఎకరాల విషయంలో నోటీసులు అందాయి.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget