అన్వేషించండి

YS Jagan In Kurnool: కడపలో వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్, అనంతరం  కర్నూలు జిల్లాకు పయనం

YS Jagan To Vist Kurnool District: సీఎం వైఎస్ జగన్ నేడు రెండో రోజు పర్యటన ముగించుకుని వైఎస్సార్ జిల్లా నుంచి కర్నూలుకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి నివాసానికి వెళ్లి పెళ్లి వేడుకలకు హాజరవుతారు.

AP CM YS Jagan Mohan Reddy to Visit Kurnool District today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్, కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. నిన్న గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీఎం జగన్ రాత్రి కడపలోనే బస చేశారు.

వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్..
నేడు (శనివారం) ఉదయం అక్కడ రెండు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్‌ అధికారి మౌర్య వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనం కానున్నారని అధికారులు తెలిపారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

నేడు కర్నూలుకు సీఎం జగన్..
సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేత, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడి వివాహం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి వివాహం ఏప్రిల్ 17న నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారు. కర్నూలు జిల్లాకు వచ్చాక కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం క్రిష్ణానగర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాబోయే వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. సీఎం కర్నూలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయడంపై చర్చించారు. సీఎం జగన్ భద్రత విషయంపై జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గ్రీన్ ఛానల్ నిర్వహించాలని, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan In Ontimitta  : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యం వ‌ద్దకు చేరుకున్న సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో కెఎస్. జవహర్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగ‌తం ప‌లికారు. అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ కు శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచ‌నం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్రప‌టం అంద‌జేశారు. సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు. 

Also Read: Weather Updates: బీ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక 

 Also Read: CM Jagan In Ontimitta : ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
Honeytrap case: అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Embed widget