అన్వేషించండి

Mobile Phone Recovery: మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!

Anantapur News | అనంతపురం పోలీసులు మొబైల్స్ రికవరీలో సరికొత్త రికార్డు సృష్టించారు. పది వేలకు పైగా సెల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందజేశారు. ఫోన్ చోరీ అయితే ఏం చేయాలో వివరించారు.

Anantapur police create record in mobile phone recovery | అనంతపురం: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఒక్క పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే మనం పడే టెన్షన్ చెప్పలేనిది. ఎందుకంటే సెల్ ఫోన్ కన్నా అందులో ఉన్న మన డేటా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుత కాలంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సెల్ఫోన్లో భద్రపరుచుకునే స్థాయికి వచ్చేసాం. అందుకే సెల్ఫోన్ చోరీకి గురైందంటే చాలు మనకి ఎక్కడా లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. మీ ఫోన్ పోయిందా ఆన్లైన్లో మీ ఫోన్ కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్ ఇస్తే మీ ఫోను మీ చెంతకే చేరుస్తున్నారు. 

 10 వేల సెల్ ఫోన్ల రికవరీ 

ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడకుండా వాటిని  పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 10,195... వీటన్నింటి విలువ సుమారు రూ 18.85 కోట్లు. ఈరోజు అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో రికవరీ మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించి... రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అంచించారు. చొరికి గురై దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకుని జిల్లా పోలీసుశాఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 

 ఇతర రాష్ట్ర వాసుల ఫోన్ లు కూడా రికవరీ. ఏ జిల్లా ఎన్ని ఫోన్లు రికవరీ ? 

ఇప్పటి వరకు అందజేసిన 10,195 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు- 6504, శ్రీ సత్య సాయి -1012, కర్నూలు- 589, కడప-401, చిత్తూరు-92, గుంటూరు-81, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-15, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07

కర్నాటక -415, తెలంగాణ-385, కేరళ-93, తమిళనాడు-71, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ - 39, ఉత్తరప్రదేశ్ - 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01.

 సెకండ్ హ్యాండ్ ఫోన్ ల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త పడాలి : 

వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఫోన్ కు సరైన బిల్ ఉంటేనే కొనుగోలు చేయాలని తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తే మీరు మీ డబ్బుతో పాటు ఫోన్ కూడా కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.  సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనాలని సూచించారు. 

 చాట్ భాట్ లేదా CEIR లో ఎలా నమోదు చేసుకోవాలి : 

సెల్ఫోన్ చోరీకి గురైతే చాట్ భాట్ లేదా CEIR లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని అనంత పోలీసులు వెల్లడించారు.

ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR ద్వారా నమోదు చేసుకోవాలి.
CEIR లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే సిమ్, IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది. 

Also Read: Festival Smartphone Offers: సగం ధరలోనే ప్రీమియం ఫోన్లు - దీపావళి మొబైల్ బ్రాండ్ల బంపర్ ఆఫర్లు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Embed widget