అన్వేషించండి

Ysrcp Bus Yatra : ముగిసిన మంత్రుల బస్సు యాత్ర, కర్నూలులో జనాలు లేక వెలవెలబోయిన సభ

Ysrcp Bus Yatra : వైసీపీ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు మిశ్రమ స్పందన లభించింది. పలు చోట్ల భారీ జనసందోహం కనిపిస్తే కొన్ని చోట్ల ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

Ysrcp Bus Yatra : ఏపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసింది. అయితే వైసీపీ బస్సు యాత్రకు మిశ్రమస్పందన లభించింది. పలుచోట్ల కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాగా పలు చోట్ల ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పలు సభలు జనాలు లేక వెలవెలబోయాయి. కర్నూలులోని ఆదివారం నిర్వహించిన సభకు ప్రజలు హాజరుకాకపోవడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభకు తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు వెళ్లిపోయారు. మంత్రులు దాదాపు ఒంటిగంటకు కర్నూలు చేరుకున్నారు. అప్పటికే జనాలు వెళ్లిపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వెళ్లిపోతున్న వారిని కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కూర్చీల్లో కుర్చోవాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో మంత్రులు సభను కొద్ది సేపు నిర్వహించి వెళ్లిపోయారు. 

అనంతపురంలో భారీ స్పందన 

అనంతరం బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలన్నీ ఆ పార్టీ కార్యకర్తలకే అందాయన్నారు. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్నారు. టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు సీఎం జగన్‌ను క్విట్ చేయాలా అన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత పథకాలు ఇస్తున్నందుకా అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. జగనన్న ముద్దు చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్తా్మన్నారు.

సీఎం జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం 

ఈ సభలో మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు. సీఎం జగన్‌ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోందని బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ అన్న కృష్ణయ్య చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారని విమర్శించారు. ఇతర  రాష్ట్రాలకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్.కృష్ణయ్య అన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh News: పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
Waqf Amendment Act 2025:అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh News: పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
Waqf Amendment Act 2025:అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
IPL 2025 PBKS VS CSK Result Update: పంజాబ్ అద్భుత విజయం.. సత్తా చాటిన ప్రియాంశ్, శశాంక్, స్లో బ్యాటింగ్ తో  చెన్నైకి నాలుగో ఓటమి
పంజాబ్ అద్భుత విజయం.. సత్తా చాటిన ప్రియాంశ్, శశాంక్, స్లో బ్యాటింగ్ తో చెన్నైకి నాలుగో ఓటమి
Deepika Padukone : స్టార్ హీరో కూతురు కోసం తల్లిగా... రియల్ లైఫ్ మదర్ అయ్యాక దీపికా డేరింగ్ డెసిషన్... డైరెక్టర్ ఏమంటున్నాడంటే ?
స్టార్ హీరో కూతురు కోసం తల్లిగా... రియల్ లైఫ్ మదర్ అయ్యాక దీపికా డేరింగ్ డెసిషన్... డైరెక్టర్ ఏమంటున్నాడంటే ?
Pawan Kalyan: మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు - ప్రమాద తీవ్రత మొదట తెలియలేదు - కుమారుడికి ప్రమాదంపై పవన్ భావోద్వేగం
మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు - ప్రమాద తీవ్రత మొదట తెలియలేదు - కుమారుడికి ప్రమాదంపై పవన్ భావోద్వేగం
US-China Tariff War: బ్రేకుల్లేని బుల్డోజర్‌లా డ్రాగన్‌పై పడ్డ ట్రంప్‌-  చైనా వస్తువులపై 104 శాతం టారిఫ్‌
బ్రేకుల్లేని బుల్డోజర్‌లా డ్రాగన్‌పై పడ్డ ట్రంప్‌- చైనా వస్తువులపై 104 శాతం టారిఫ్‌
Embed widget