అన్వేషించండి

Krishna News : బహిరంగ ప్రదేశాల్లో వాల్ పోస్టర్లకు అనుమతులు తప్పనిసరి, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాలు

Krishna News : కృష్ణా జిల్లాలో వాల్ పోస్టర్ల పొలిటికల్ వార్ నడుస్తోంది. సీఎం జగన్ కటౌట్ కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో వాల్ పోస్టర్లకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు సూచించారు.

Krishna News : కృష్ణా జిల్లాలో పొలిటికల్ వాల్ పోస్టర్ల రగడ మొదలైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ రాత్రికి రాత్రి వెలసిన పోస్టర్లపై అధికార పక్షం మండిపడింది. దీంతో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. అధికార పార్టీకి చెందిన నేతలు, జనసేన నేతలపై పోలీసులు ముందే దాడికి పాల్పడటంతో పోలీసులు ఇరువర్గాల పై కేసులు నమోదు చేశారు. దీంతో బహిరంగ ప్రదేశాలలో వాల్ పోస్టర్లకు అనుమతులు తప్పనిసరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

పోస్టర్లపై ఎస్పీ వార్నింగ్ 

బహిరంగ ప్రదేశాలలో వాల్ పోసర్టను ప్రదర్శించాలంటే అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. వ్యాపార, రాజకీయ, మతపరమైన సమాచారాన్ని గోడ పత్రికల రూపంలో ప్రదర్శించాలంటే, ఆ పత్రికల్లో ముద్రించిన సమాచారం స్థానిక పోలీసు వారికి తెలియజేసి, అందులో పొందుపరిచిన సమాచారం ఎవరి మనోభావాలను దెబ్బతీసేదిగా లేవని నిర్ధారించిన తరువాతే  ప్రదర్శించాలన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పోస్టర్లు, గోడ పత్రికలు బహిరంగంగా ప్రదర్శిస్తే, తద్వారా ఏవైనా అల్లర్లు చెలరేగితే కారుకులైన వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాల్ పోస్టర్ల ముద్రణ, ప్రదర్శనలో నిర్లక్ష్యం వహించవద్దని, పోలీసువారి అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు.

నేరాలపై ఎస్పీ సమీక్ష 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ గొడవలు నేపథ్యంలో అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహారాలు తెరమీదకు వస్తున్న తరుణంలో కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గొడవలు, అల్లర్లు సృష్టించే గ్రూపులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేస్తూ, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఎస్పీ అన్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించుకోగలమని, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో విజబుల్ పోలీసింగ్ ను పెంచి అసాంఘిక శక్తుల ఆగడాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అంతే కాదు బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, రాత్రిపూట గస్తీ తిరిగే బీట్ సిబ్బందికి పాయింట్ బుక్స్ అందజేసి ఎవరు ఎన్ని ప్రాంతాలు పరిశీలించింది, ఎంతమంది అపరిచిత వ్యక్తులను విచారించింది, పాయింట్ బుక్ లో నమోదు చేయాలన్నారు. రాత్రి పూట జరిగే నేరాలను, దొంగతనాలను అదుపు చేయాలని, రాజకీయ విభేదాలు అర్ధరాత్రి తెర మీదకు వస్తున్న కారణంగా  అప్రమత్తత అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులను సకాలంలో దర్యాఫ్తు పూర్తి చేసి చార్జిషీట్  ఫైల్ చేయాలన్నారు.

మంత్రి జోగి రమేష్ ఇలాఖాలో 

మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహస్తున్న పెడన నియోజకవర్గంలో సీఎం కటౌట్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పాటు జోగి రమేష్ కు వ్యతిరేకంగా  ప్రభుత్వం అవినీతి పేరుతో రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించారు. అయితే ఇవన్నీ జనసేనకు చెందిన నాయకులే చేశారని వైసీపీ భావిస్తోంది. దీంతో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్పందించి ఇరు వర్గాల పై కేసులు నమోదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget