అన్వేషించండి

Nujiveedu TDP Incharge : పార్టీలో చేరకుండానే కొలుసు పార్థసారధికి బాధ్యతలు - రెండు చోట్ల చాన్సిచ్చిన టీడీపీ !

Kolusu Parthasaradhi : కొలుసు పార్థసారధికి ఏలూరు లోక్ సభ, నూజివీడు ఇంచార్జ్ పదవుల్ని టీడీపీ ఇచ్చింది. నూజివీడు టీడీపీ ఇంచార్జ్ వైసీపీ నేతల్ని కలవడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నారు.

Nujiveedu TDP Incharge Kolusu Parthasaradhi :  వైసీపీకి చెందిన పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఇంకా టీడీపీలో చేరలేదు. అయితే ఆయనను ఏలూరు పార్లమెంట్, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయనకు ఈ రెండు స్థానాల్లో ఒక సీటు ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్థసారధి.. నూజివీడులో టీడీపీ క్యాడర్ ను కలుస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనకే సీటివ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు పిలిచించి మాట్లాడినా ఆయన తగ్గలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన సోమవారం సమవేశం అయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆయనను ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించి.. వెంటనే పార్థసారధిని ఇంచార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 
Nujiveedu TDP Incharge : పార్టీలో చేరకుండానే కొలుసు పార్థసారధికి బాధ్యతలు - రెండు చోట్ల చాన్సిచ్చిన టీడీపీ !

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా ఆయనకు నూజివీడు టిక్కెట్ కేటాయించరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మైలవరం టిక్కెట్ కేటాయిస్తారని అంటున్నారు.  మంత్రి జోగి రమేష్‌తో విభేదాల కారణంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనుండటంతో ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖారారు చేసింది. అయితే స్వర్ణాల తిరుమలరావు అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే విమర్శలు తలెత్తడంతో మైలవరం నియోజకవర్గం అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో దృష్ట్యా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గంపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది.                        

మైలవరం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే , నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. సోమవారం జగన్‌ను సీఎం క్యాంపు కార్యలయంలో కలిశారాయన. దీంతో ముద్దరబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖారారైంది.నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో చర్చించిన తరువాతే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా సీఎం జగన్ సూచన మేరకు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధి టీడీపీలో చేరి.. నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి.. మైలవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సారి కృష్ణా జిల్లాలో నేతలు అటూ ఇటూ మారిపోవడం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.                                                          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget