అన్వేషించండి

kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన

Andhra News: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన క్రమంలో ఓ అధికారి కార్యాలయంలో కాకుండా టీ దుకాణంలో దస్త్రాలపై సంతకాలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది.

Kadiri Sub Registrar Registered Lands In Tea Shop: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి పెరిగిన నేపథ్యంలో శుక్రవారం భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఓ టీ షాపులోనే దస్త్రాలపై సంతకం చేయడం విమర్శలకు తావిచ్చింది. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సి ఉండగా.. సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ (Kadiri Sub Registrar) శ్రీనివాసులు టీ కొట్టునే రిజిస్ట్రార్ ఆఫీసుగా మార్చుకున్నారు. సదరు అధికారి టీ దుకాణంలో దస్త్రాలపై సంతకాలు చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సబ్ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు

కాగా, ఏపీలోని భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. ఇది శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న క్రమంలో శుక్రవారమే భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అంతా భావించారు. దీంతో అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులు తీశారు. ఆ ఒక్కరోజే కదిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 130కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే, కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు శుక్రవారం సెలవులో ఉన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెలవులో ఉంటూనే దళారుల ద్వారా దస్త్రాలను తెప్పించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలోని టీ దుకాణంలో సంతకాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చిన ఆయన మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో ఆయన వ్యవహారశైలి ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.

భారీగా ఆదాయం

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగిన క్రమంలో అంతకంటే ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు ప్రజలు త్వరపడ్డారు. జనవరి 31 ఒక్కరోజే అనంతపురం జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5.19 కోట్ల ఆదాయం వచ్చింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

కాగా.. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. విజయవాడ, విశాఖతో పాటు కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్ని చోట్లు ఛార్జీలు తగ్గించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే కొనసాగనున్నాయి. మార్కెట్ విలువకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్ట్ 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్, స్ట్రక్చర్ విలువలు సవరించాలి. కానీ, గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రివిజన్ పేరుతో వీటిని మార్చగా.. వీటిపై సమీక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని నిర్ణయించింది.

Also Read: Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget