అన్వేషించండి

Kadiri BJP RDO Office Protest: కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!

Vishnuvardhan Reddy Kadiri Land Grab Row: కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాలను కబ్జా చేయడంపై బీజేపీ సమరం ప్రారంభించింది. ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించింది.

Construction Workers Plot Encroachment Kadiri:   శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో భూమాఫియా అక్రమాలకు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉధృతమైన ఆందోళన వ్యక్తమైంది. కమ్మరవాండ్లపల్లి పరిధిలోని సర్వే నంబర్ 1769, 1770 లలో గతంలో నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను దళారులు, భూమాఫియా కబ్జా చేయడాన్ని నిరసిస్తూ కదిరి ఆర్డీవో  కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి.. బాధితులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడించి, రెవెన్యూ యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 దళారుల దౌర్జన్యం.. 500 మంది కార్మికులకు ఘోర అన్యాయం!  

 కదిరిలో దశాబ్ద కాలంగా నివసిస్తున్న 500 మంది నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు చెందిన విలువైన భూములను స్థానిక దళారులు నకిలీ పట్టాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా చేశారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆశతో ఉంటూ.. ఇప్పటికే కాలం చేసిన సుమారు 40 మంది మరణించిన కార్మికుల కుటుంబాల పట్టాలను సైతం భూమాఫియా లాక్కోవడం అత్యంత అమానుషమని ఆరోపించారు. గతంలో జరిగిన అధికారిక విచారణలోనే ఈ భూముల కేటాయింపుల్లో, రికార్డుల తారుమారులో భారీ అక్రమాలు జరిగినట్లు తేలినా.. ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రెవెన్యూ అధికారుల కొమ్ముకాయడం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

 అధికారుల సస్పెన్షన్.. క్రిమినల్ కేసులకు డిమాండ్ 

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన దళారులతో పాటు, వారికి సహకరించి ప్రభుత్వ భూములను, పేదల స్థలాలను విక్రయించడానికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. లౌకిక, ప్రజా ప్రభుత్వంలో సామాన్యుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని.. రెవెన్యూ శాఖలో చేరిన అవినీతి పురుగులను ఏరిపారేయడానికి నిష్పక్షపాత విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. అర్హులైన అసలైన భవన నిర్మాణ కార్మికులకు వారి స్థలాలను తక్షణమే గుర్తించి సరిహద్దులతో సహా అప్పగించాలని స్పష్టం చేశారు.
 
కదిరి ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు! 

కదిరి నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి నిరంతరం ప్రజాపక్షాన నిలుస్తూ అవినీతిపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల కదిరి ఖాద్రీశుడి ఆలయ కోనేరు భృగుతీర్థం పునర్నిర్మాణ పనుల్లో జరిగిన రూ. 6 కోట్ల కుంభకోణంపై గళమెత్తి విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసింది ఆయనే. అంతేకాకుండా, నంబులపూలకుంట మండలంలో ప్రైవేట్ సోలార్ ప్లాంట్ భూసేకరణ పేరుతో దళారులు స్థానిక రైతుల భూ రికార్డులను రాత్రికి రాత్రే మార్చేస్తూ బెదిరింపులకు గురిచేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలిచారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా జరిగిన సుమారు రూ. 25 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన రిజిస్ట్రేషన్ స్కామ్‌ను కూడా విష్ణువర్ధన్ రెడ్డి బయటపెట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

 చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం.. బీజేపీ హెచ్చరిక! 

పేదలు, కార్మికుల హక్కులను కాలరాస్తున్న భూమాఫియాపై పోలీసులు, జిల్లా యంత్రాంగం తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు, వారి స్థలాలు వారికి దక్కే వరకు బీజేపీ పోరాటం ఆగే ప్రసక్తే లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ముట్టడి అనంతరం ఆర్డీవోకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఒకవేళ వారం రోజుల్లోగా కబ్జాదారులపై, అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించకపోతే.. బాధితులందరినీ సమీకరించి కదిరి పట్టణాన్ని స్తంభింపజేసేలా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget