Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
AP Elections 2024: వైఎస్ షర్మిలతోపాటుగా చంద్రబాబు, పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, వైఎస్ సునీత తదితరులు వివేకా హత్య గురించి మాట్లాడవద్దని కోర్టు నిర్దేశించింది.

Vivekananda Reddy Murder Case: ఏపీలో ముఖ్యంగా కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ఉన్న వివేకా హత్య కేసు విషయంలో జిల్లా కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకా హత్య కేసు గురించి ప్రచారంలో ప్రస్తావించవద్దని.. కడప కోర్టు ఆదేశించింది. తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా రాజకీయ నేతలు పదే పదే వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని.. తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టుకు వెళ్లారు.
దీంతో కోర్టు తాజా నిర్ణయాన్ని వెలువరించింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతోపాటుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేపీ నేత పురందీశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, వైఎస్ సునీత వివేకా హత్య గురించి మాట్లాడవద్దని నిర్దేశించింది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















