అన్వేషించండి

Janasena March 14 : పేర్ని నాని నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ - మార్చి 14న నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం !

మచిలీపట్నంలో మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ జరగనుంది.

Janasena March 14 :   జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే లా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన ‌కార్యక్రమాలు‌ నిర్వహించిందని  నాదెండ్ల మనోహర్ గుర్తు చేసుకున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్  తొమ్మిదేళ్ల క్రితం పార్టీ ని పెట్టారని.. వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు‌ చేసినా ప్రజల కోసం నిలబడ్డారన్నారు.  మా జనసేన నాయకులు, వీర మహిళలు అధినేత అండగా నిలిచారు  .. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్పందించారని సంతృప్తి వ్యక్తం చేశారు. 

వారాహి వాహనంపై ర్యాలీగా వేదిక మీదకు రానున్న పవన్ కల్యాణ్ 

మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ముందుకు‌ వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.  పదో ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నం లో నిర్వహిస్తామన్నారు.  తుఫాన్ సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారని.. రైతులను ఆదుకోని జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు.  ఆనాడు రైతులకు పవన్ అండగా నిలిచారని అందుకే  మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టాలని‌ కోరారని మనోహర్ గుర్తు చేసుకున్నారు.  34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు‌ చేస్తున్నామని..  భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని ప్రకటించారు.  మహనీయులు గురించి చాటి‌ చెప్పేలా అక్కడ ‌ప్రత్యేక‌ కార్యక్రమాలు‌ చేపడతామని.. మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య, ను గుర్తు చేసుకుంటామన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికకు   పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామన్నారు. సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటామని తెలిపారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నాదెండ్ల పిలుపు

సాయంత్రం జరిగే సభ కు పవన్ ఐదు గంటలకు వస్తారని..  మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి‌ వారాహి వాహనం లో‌ పవన్ కళ్యాణ్ బయలు దేరతారని మనోహర్ తెలిపారు. వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే‌ విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేసారు.  త్వరలోనే మళ్లీ ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు.  ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు  కోసం పాటుపడుతున్న పవన్ ను ఆదరించాలని కోరారు. వైసిపి విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలని..  ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి కి వ్యతిరేకంగా ఓటు‌ వేయాలని పవన్ కళ్యాణ్ తరపున నేను కోరుతున్నానని తెలిపారు. పార్టీ శ్రేణులకు కూడా పవన్ తన మాటగా‌ చెప్పాలన్నారు

పేర్ని నాని నియోజకవర్గంలో సభ పెట్టడంలో రాజకీయ వ్యూహం !

మచిలీపట్నం నుంచి   ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని ఉన్నారు.  జనసేనానిపై ఆయన ఘాటు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.  ఇప్పుడు ఆయన నియోజకవర్గ గడ్డపైనే ఆవిర్భావ సభను ప్లాన్ చేశారు.  గత ఏడాది ఆవిర్భావ సభను ఇప్పటంలో నిర్వహించారు. చివరి వరకూ ఆవిర్భావ సభ కోసం ఇబ్బందులు తప్పలేదు. చివరికి  రైతులు ముందుకు వచ్చి  పొలం ఇవ్వడంతో సభ నిర్వహించారు. అయితే ఈ సారి ముందుగానే మచిలీపట్నంలో స్థలం ఖరారు చేసుకుని అధికారిక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget