అన్వేషించండి

Jagananna Thodu Scheme: ఏపీలో జగనన్న తోడు, వారికి వడ్డీ లేని రుణాలు - నేడే ఖాతాల్లోకి రూ.10 వేలు

Jagananna Thodu: నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. నేడు వారి ఖాతాల్లో నగదు జమ కానుంది.

జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డుతోంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తే.. వారి కాళ్లమీద వారిని నిలబెట్టేందుకు ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు.. 
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, గత ఆరు నెలలకు సంబంధించిన రూ. 15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను నేడు (03.08.2022, బుధవారం) క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు సీఎం  వైఎస్‌ జగన్‌. ఈ పథకం ద్వారా  అందిస్తున్న రూ. 395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు, నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు (వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందినవారు 5,07,533) బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల లబ్ధిదారులకు  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 48.48 కోట్లు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు.. 
చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలల కోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మరోసారి వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి.
వీరందరికీ జగనన్న తోడు...
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు విక్రయిస్తూ జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్‌ సైకిళ్ళు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారికి జగనన్న తోడు లభించనుంది.

వారితోపాటు చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు వడ్డీలేని రుణాలు పొందడానికి అర్హులు. ఈ అవ‌కాశం ఇప్ప‌టికి ద‌క్క‌ని వారు , అర్హత ఉండీ జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేకుండా, గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చునని, లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
కాల్ మ‌ని కేటుగాళ్ల నుండి విముక్తి....
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీలు తీసుకోవడంతో కాల్ మ‌నీ కేటుగాళ్ల నుంచి వేధింపులు అధికంగా ఉండేవి. వ‌డ్డీ వ‌సూలు చేసుకోవ‌టంతో పాటుగా , వ్యాపారుల అవ‌స‌రాలు ఆస‌రాగా చేసుకొని వారి బ‌ల‌హీన‌త‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని కొంద‌రు వ‌డ్డీ వ్యాపారులు కాల్ మ‌నీని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. దీంతో ఎంతో మంది చిరు వ్యాపారులు ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌టంతో పాటుగా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయి. అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న చిరు వ్యాపారుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం స్వ‌యంగా జగనన్న తోడు ద్వారా భ‌రోసా క‌ల్పించింది.
Also Read: నెలరోజుల గ్యాప్ లో నెల్లూరుకి సీఎం జగన్.. ఎందుకంటే..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget