అన్వేషించండి

నెలరోజుల గ్యాప్ లో నెల్లూరుకి సీఎం జగన్.. ఎందుకంటే..?

ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది.

ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు పూర్తి కావస్తున్నాయి. అందులో ఒకటి సంగం బ్యారేజి. దీనికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అనే పేరు పెట్టాలనేది జగన్ ఆలోచన. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ దివంగత నేత గౌతమ్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

కందుకూరు నెల్లూరు జిల్లాలోనే.. 
నెల్లూరు జిల్లా నాయకులతో జరిగిన మీటింగ్ లో సీఎం జగన్ మరో విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నెల్లూరు జిల్లాలో కలిసింది. దీనిపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ మీటింగ్ లో తెరపడింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కొత్తగా కందుకూరు నెల్లూరు జిల్లాలో కలవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని కలెక్టర్‌ చక్రధర్‌ బాబునుకు ఆదేశాలిచ్చారు సీఎం జగన్. పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. దీంతో కొద్దిరోజులుగా కందుకూరు విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది. కందుకూరు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుందని అధికారులు, ఎమ్మెల్యేలకు మరోసారి సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టయింది. 

గడప గడపలో ప్రసన్న.. 
గతంలో గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఆయన నెలరోజుల షెడ్యూల్ ప్రకటించి మరీ గడప గడపలో జాయిన్ అయ్యారు. ఆ కారణంగా ఆయన జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ కి హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇటీవల ప్రారంభించిన రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నారంపేట ఇండస్ట్రియల్‌ పార్కులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పారిశ్రామివేత్తలను గుర్తించడం వంటి వివరాలు కూడా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు తెలపాలని కోరారు. పాదయాత్రలోగానీ, జిల్లాకు వచ్చిన సందర్భాల్లో ఇచ్చిన హామీల్లో ఏమైనా చేయాల్సి ఉంటే గుర్తు చేయాలని ఎమ్మెల్యేలను కోరారు జగన్. పెన్నా పొర్లుకట్ట నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించారు, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సంగం బ్యారేజీ పనులు ఈనెల 15లోపు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసుకుని ఈనెల 17నుంచి 20వతేదీ లోపు ఆ బ్యారేజీ పనుల ప్రారంభానికి నెల్లూరు జిల్లాకు వస్తానని చెప్పారు సీఎం జగన్. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget