అన్వేషించండి

నెలరోజుల గ్యాప్ లో నెల్లూరుకి సీఎం జగన్.. ఎందుకంటే..?

ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది.

ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు పూర్తి కావస్తున్నాయి. అందులో ఒకటి సంగం బ్యారేజి. దీనికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అనే పేరు పెట్టాలనేది జగన్ ఆలోచన. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ దివంగత నేత గౌతమ్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

కందుకూరు నెల్లూరు జిల్లాలోనే.. 
నెల్లూరు జిల్లా నాయకులతో జరిగిన మీటింగ్ లో సీఎం జగన్ మరో విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నెల్లూరు జిల్లాలో కలిసింది. దీనిపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ మీటింగ్ లో తెరపడింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కొత్తగా కందుకూరు నెల్లూరు జిల్లాలో కలవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని కలెక్టర్‌ చక్రధర్‌ బాబునుకు ఆదేశాలిచ్చారు సీఎం జగన్. పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. దీంతో కొద్దిరోజులుగా కందుకూరు విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది. కందుకూరు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుందని అధికారులు, ఎమ్మెల్యేలకు మరోసారి సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టయింది. 

గడప గడపలో ప్రసన్న.. 
గతంలో గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఆయన నెలరోజుల షెడ్యూల్ ప్రకటించి మరీ గడప గడపలో జాయిన్ అయ్యారు. ఆ కారణంగా ఆయన జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ కి హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇటీవల ప్రారంభించిన రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నారంపేట ఇండస్ట్రియల్‌ పార్కులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పారిశ్రామివేత్తలను గుర్తించడం వంటి వివరాలు కూడా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు తెలపాలని కోరారు. పాదయాత్రలోగానీ, జిల్లాకు వచ్చిన సందర్భాల్లో ఇచ్చిన హామీల్లో ఏమైనా చేయాల్సి ఉంటే గుర్తు చేయాలని ఎమ్మెల్యేలను కోరారు జగన్. పెన్నా పొర్లుకట్ట నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించారు, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సంగం బ్యారేజీ పనులు ఈనెల 15లోపు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసుకుని ఈనెల 17నుంచి 20వతేదీ లోపు ఆ బ్యారేజీ పనుల ప్రారంభానికి నెల్లూరు జిల్లాకు వస్తానని చెప్పారు సీఎం జగన్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Embed widget