అన్వేషించండి

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !

Andhra News : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని జగన్ అన్నారు. ఏపీ ప్రజలను జగన్ హెచ్చరించారు. ప్రచారసభల్లో భాగంగా నంద్యాలలో జగన్ ప్రసంగించారు.

YSRCP :  చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉందని సీఎం జగన్ నంద్యాలలో హెచ్చరించారు.  ఈ ఎన్నికలు  బాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు.   ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.  

 తాను ఒంటరిగా ఎన్నికలు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడయ్యిందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలా ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. మోసాల చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. మూడు రాజధానులు, కొత్తగా రాష్ట్రంలో మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తాను చేసినన్ని అభివృద్ది పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తు కొస్తాయని ఎద్దేవా చేశారు. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలు 99 శాతం అమలు చేశామని జగన్ పేర్కొన్నారు.

 నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారన్నారు. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. ఇటు వైపు నేను ఒక్కడ్నే..అటు వైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్‌. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడి అందించాం. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధం. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లుకూడా ముందుకు తీసుకెళ్తాం. 2 లక్షల 77వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు చేశాడా?. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాన్నాడు.. చేశాడా?. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు? మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్‌కో వస్తుంది. కొత్త రంగులు, కొత్త మోసాలతో బాబు మేనిఫెస్టో ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు అండ్‌కో పని దోచుకోవడం, పంచుకోవడమే’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

టాప్ హెడ్ లైన్స్

Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 
Andhra Pradesh Green Chairman: ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాగబాబు! పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రణాళిక రూపకల్పనే ధ్యేయమని ప్రకటన!
ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాగబాబు! పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రణాళిక రూపకల్పనే ధ్యేయమని ప్రకటన!
Ongole Radisson Hotel:100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
Vaccines For Adults : వ్యాక్సిన్లు తీసుకుంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
వ్యాక్సిన్లు తీసుకుంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Ongole Radisson Hotel:100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Maharashtra Crime News: శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
Embed widget