అన్వేషించండి

AB Venkateswar Rao : సస్పెన్షన్ ముగిసింది , పూర్తి జీతం ఇవ్వండి - ఏపీ సీఎస్‌కు ఏబీవీ లేఖ !

సస్పెన్షన్ కాలం ముగిసినందున పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. లేఖలో సస్పెన్షన్ నిబంధనలను గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. నిబంధనల ప్రకారం తన సస్పెన్షన్ కాలం ముగిసిందని... తనకు పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆయనకు ప్రస్తుతం డీజీపీ హోదా ఉంది.  గత రెండేళ్లుగా ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అంతకు ముందు ఆరేడు నెలల పాటు ఆయనకు పోస్టింగ్ లేదు. తాను సస్పెన్షన్‌లో రెండేళ్లుగా ఉన్నానని .. తన సస్పెన్షన్ కాలం ముగిసిందని ... అందుకే తనకు పూర్తి జీతం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు సస్పెన్షన్ విధించారని ఇక ప్రభుత్వానికి అధికారం లేదని ఏబీవీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు 2022 ఫిబ్రవరి 8తో రెండేళ్లు పూర్తైన కారణంగా.. రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా తొలగిపోయినట్టేనన్నారు. తన సస్పెన్షన్‌పై పొడిగింపు జనవరి 27తోనే ముగిసిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను కొనసాగించాలంటే.. కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని ఏబీవీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.  గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. 31 .7 .2021న చివరిసారిగా  తన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన.. జీవోను రహస్యంగా ఉంచారని.. తనకు కాపీ కూడా ఇవ్వలేదని లేఖలో తెలిపారు.  ఏమైనప్పటికీ ఫిబ్రవరి 8తో తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 

ఏపీ ప్రభుత్వం  ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని గత ఆగస్టులో కేంద్రానికి సిఫార్సు చేసంది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు   కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ  కూడా పూర్తయింది. ఆ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించారు.  ఇవన్నీ విచారణలో ఉండగానే..  ఏబీవీపై మేజర్‌ పెనాల్టీ అంటే డిస్మిస్ చేయాలని   ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును,  అభియోగ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక... యూపీఎస్‌సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఇప్పటి వరకూ అలాంటి నిర్ణయం రాలేదు. దీంతో ఇప్పుడు ఏబీవీ లేఖపై ప్రభుత్వం ఏం  చేస్తుందనే ఆసక్తి అధికారవర్గాల్లో ఏర్పడింది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
Embed widget