అన్వేషించండి

IPAC Reaction: 2024 ఎన్నికల్లో వారి గెలుపు కోసం కృషిచేస్తాం: ఐప్యాక్ కీలక ప్రకటన

IPAC For AP Elections 2024: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది.

AP Elections 2024:  విజయవాడ: ఏపీ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) వ్యూహకర్తగా పనిచేస్తారని ప్రచారం జరిగింది. ఐప్యాక్ టీమ్ వైసీపీతో తెగదెంపులు చేసుకుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారతాయని పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. కానీ చంద్రబాబు, పీకే సుదీర్ఘ భేటీ అనంతరం ఐప్యాక్ సంస్థ స్పందించింది. వచ్చే ఎన్నికల్లోనూ తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. 
వైసీపీతో కలిసి పనిచేస్తాం - ఐప్యాక్
గత ఏడాది నుంచి ఐప్యాక్ సంస్థ వైసీపీతో కలిసి పనిచేస్తుందని టీమ్ తెలిపింంది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించేందుకు తమ సంస్థ విశ్రాంతి లేకుండా పనిచేస్తుందని సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు జగన్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించి అధికారంలోకి తెస్తామని ఐప్యాక్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

కాగా, ఐప్యాక్ ను స్థాపించింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఆయన ఐప్యాక్ నుంచి బయటకు వచ్చినట్లు గతంలోనే ప్రకటించారు. రాబిన్ శర్మ, శాంతను సింగ్, ప్రశాంత్ కిశోర్ కలిసి ఐప్యాక్ సంస్థను ప్రారంభించిన సభ్యులు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఐప్యాక్ నుంచి వచ్చారు. ప్రస్తుతం టీడీపీకి షో టైమ్ కన్సల్టింగ్ అనే సంస్థ పనిచేస్తోంది. రాబిన్ శర్మ టీమ్ టీడీపీకి ఎన్నికల కోసం పనిచేస్తోంది. అయితే శనివారం ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ వచ్చి .. నేరుగా వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అది మొదలుకుని ఐప్యాక్ టీమ్ వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబుతో చేతులు కలిపిందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ టీమ్ తాము వైసీపీతో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేసింది. 

మరోవైపు ఏపీ మంత్రులు పీకే, చంద్రబాబు భేటీపై సెటైర్లు వేస్తున్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా జగన్ ను ఏం చేయలేరని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కోడి కత్తి, బాబాయి హత్య లాంటి ప్లాన్స్ ఇచ్చిన పీకేతో చంద్రబాబు కలిశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేయగా.. టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోడి కత్తి, బాబాయి మర్డర్ ప్లాన్ గురించి ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని సెటైర్లు వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget