అన్వేషించండి

IPAC Reaction: 2024 ఎన్నికల్లో వారి గెలుపు కోసం కృషిచేస్తాం: ఐప్యాక్ కీలక ప్రకటన

IPAC For AP Elections 2024: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది.

AP Elections 2024:  విజయవాడ: ఏపీ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) వ్యూహకర్తగా పనిచేస్తారని ప్రచారం జరిగింది. ఐప్యాక్ టీమ్ వైసీపీతో తెగదెంపులు చేసుకుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారతాయని పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. కానీ చంద్రబాబు, పీకే సుదీర్ఘ భేటీ అనంతరం ఐప్యాక్ సంస్థ స్పందించింది. వచ్చే ఎన్నికల్లోనూ తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. 
వైసీపీతో కలిసి పనిచేస్తాం - ఐప్యాక్
గత ఏడాది నుంచి ఐప్యాక్ సంస్థ వైసీపీతో కలిసి పనిచేస్తుందని టీమ్ తెలిపింంది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించేందుకు తమ సంస్థ విశ్రాంతి లేకుండా పనిచేస్తుందని సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు జగన్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించి అధికారంలోకి తెస్తామని ఐప్యాక్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

కాగా, ఐప్యాక్ ను స్థాపించింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఆయన ఐప్యాక్ నుంచి బయటకు వచ్చినట్లు గతంలోనే ప్రకటించారు. రాబిన్ శర్మ, శాంతను సింగ్, ప్రశాంత్ కిశోర్ కలిసి ఐప్యాక్ సంస్థను ప్రారంభించిన సభ్యులు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఐప్యాక్ నుంచి వచ్చారు. ప్రస్తుతం టీడీపీకి షో టైమ్ కన్సల్టింగ్ అనే సంస్థ పనిచేస్తోంది. రాబిన్ శర్మ టీమ్ టీడీపీకి ఎన్నికల కోసం పనిచేస్తోంది. అయితే శనివారం ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ వచ్చి .. నేరుగా వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అది మొదలుకుని ఐప్యాక్ టీమ్ వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబుతో చేతులు కలిపిందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ టీమ్ తాము వైసీపీతో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేసింది. 

మరోవైపు ఏపీ మంత్రులు పీకే, చంద్రబాబు భేటీపై సెటైర్లు వేస్తున్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా జగన్ ను ఏం చేయలేరని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కోడి కత్తి, బాబాయి హత్య లాంటి ప్లాన్స్ ఇచ్చిన పీకేతో చంద్రబాబు కలిశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేయగా.. టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోడి కత్తి, బాబాయి మర్డర్ ప్లాన్ గురించి ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని సెటైర్లు వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget