అన్వేషించండి

Vangalapudi Anitha: '3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత

Tirupati News: తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు.

Home Minister Anitha Visited Tirupati Victim Family: తిరుపతి జిల్లా వడమాలపేటలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితునికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 3 నెలల్లోనే కఠిన శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు.  బాధిత కుటుంబాన్ని ఆమె ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని వారికి అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

'బుద్ధున్న వారు రాజకీయం చేయరు'

'చిన్నపిల్లకు అన్యాయం జరిగింది. తాగిన మత్తులో తల్లి, చెల్లికి తేడా తెలియదా.?. పండుగ అని ఇంటికి వస్తే అడుకునే చిన్నారిని ఇలా చేశారు. తొలుత చిన్నారి కనిపించడం లేదని 100కు ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కానీ చిన్నారిని ప్రాణాలతో రక్షించలేకపోయారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి 3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం. ఇలాంటి సమయంలో బుద్ధి ఉన్న వారు ఎవరూ రాజకీయం చేయరు. ఇటీవల పుంగనూరులోనూ డబ్బుల విషయంలో చిన్నారిని చంపేశారు. చిన్నపిల్లల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారు. గత ఐదేళ్లలో ప్రతీ 8 గంటలకు ఓ దాడి జరిగింది. దిశ చట్టం యాప్ ఉంటే ఇలాంటివి జరగవని వైసీపీ నేతలు అంటున్నారు. మేము మహిళా యాప్ వృద్ధిలోకి తెచ్చాం.' అని తెలిపారు.

'వైసీపీ గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారు. కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. యువతను గంజాయికి బానిసను చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లోనే గంజాయిని అదుపు చేశాం. పూర్తిగా కంట్రోల్ చేసేందుకు నార్కోటిక్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇలాంటి హత్యాచార ఘటనలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బాధితుల పక్షాన నిలబడడమే కాదు, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సాధికారత, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది. ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. అప్పుడు రోజాకు తెలియలేదా..?. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం.' అంటూ అనిత మండిపడ్డారు.

ఇదీ జరిగింది

తిరుపతి జిల్లా వడమాలపేటకు చెందిన దంపతులు కొన్నాళ్లుగా ఇక్కడే ఉండి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడున్నరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. వీరికి ఇంటి సమీపంలోనే ఉంటున్న సుశాంత్ అలియాస్ నాగరాజు (23)కు తల్లిదండ్రులు లేరు. పెదనాన్న వద్ద పెరిగినా వ్యసనాలకు బానిస కావడంతో అతన్ని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో చెంచయ్య కుమారుడు వెంకటేశ్ వద్ద సుశాంత్ ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటోన్న పాపకు చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లాడు. పాప అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి విచారించి నిందితున్ని పట్టుకున్నారు. పాపపై దారుణానికి ఒడిగట్టి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget