అన్వేషించండి

Guntur Mirchi: గుంటూరు మిర్చి ధర ఘాటు - ఆల్ టైమ్ రికార్డు రేటు!

Guntur Mirchi: గుంటూరు మిర్చికి ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది మంచి ధర వస్తోంది. రికార్డు స్థాయి ధరలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Guntur Mirchi: మిర్చి రైతుల పంట పండుతోంది. మార్కెట్ లో మంచి ధర వస్తోంది. మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ధర చాలా తక్కువగా ఉండగా.. ఈసారి మాత్రం ధరలు నానాటికీ పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. 

మార్కెట్ మాయాజాలం

గతంలో ఎన్నడూ లేని విధంగా  ఏడాది మిర్చి ధర పెరగడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మిర్చి పంట చేతికి రాకముందు ధరలు ఆకాశంలో ఉంటాయి. వాటిని చూసి రైతులు సంబరపడిపోతారు. ఈ యేడు రేట్లు బాగున్నాయని, మంచి దిగుబడి కూడా వస్తే కొంత లాభాలతో సంవత్సరం గడుస్తుందని ఆశిస్తారు. కానీ పంట కోత తర్వాత రైతుల ఆశలు గల్లంతు అవుతుంటాయి. ఆకాశంలో ఉన్న ధర అథఃపాతాళానికి పడిపోతుంది. మిర్చి కోతల తర్వాత వాటిని టిక్కీలుగా కట్టి గుంటూరు యార్డుకు తీసుకువచ్చిన తర్వాత ధర భారీగా పడిపోతుంది. దళారుల ధరల ఆటలో రైతుల ప్రతి ఏడాది చిత్తు అవుతూనే ఉంటుంటాడు.  మార్కెట్ మాయాజాలం రైతును బలి చేస్తూనే వస్తోంది. కానీ వ్యవసాయం వ్యాపారంగా కాకుండా జీవన విధానంగా చూసే రైతులు.. మరుసటి ఏడాదైనా మంచి ధర రాకపోదా అని పంటలు వేస్తూనే ఉంటారు.

గతేడాదికి భిన్నంగా రేట్లు..

ఈ ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చిన నాటి నంచి ఇప్పటి వరకు ధర పెరిగిందే కాని తగ్గలేదు. ఇలా ధరలు తగ్గకపోవడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మిర్చి దిగుబడి చాలా పడిపోయింది. తెగులు సోకి చాలా మంది రైతులు పంట నష్టపోయారు. దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. 

క్వింటాలుకు ఎంత ధర?

ఈ ఏడాది మిర్చి క్వింటాల్ కు రూ.18 వేల ధర పలికింది. అక్కడి నుండి మిర్చి ధర పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో క్వింటా మిర్చికి రూ.32 వేలు ఇస్తుండటంతో రైతులు ఖుషీ అవుతున్నారు. ధరలు బాగుండటం పట్ల అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్వింటా మిర్చికి రూ.32 వేలు రావడం రికార్డు స్థాయి ధర మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు అని వ్యాపారులు చెబుతున్నారు. 

ఈ ఏడాది తగ్గిన దిగుబడి..

గత ఏడాది మిర్ఛి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది తక్కువ విస్తీర్ణం లో పంటను సాగు చేయడంతో మిర్చి ధరలు అమాంతం పెరిగాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ధరల పెరుగుదల ఈ ఏడాది మొత్తం కొనసాగుతుందని చెబుతున్నారు. ఆసియా లోనే అతి పద్ద మిర్చి యార్డ్ గా గుంటూరు మిర్చి యార్డ్ పేరు గాంచింది. గుంటూరు మిర్చి యార్డ్ కు ప్రతి రోజు 20 వేల నుంచి 40 వేల క్విటాళ్ల సరకు వస్తుంది. ప్రతి రోజు గుంటూరు యార్డ్ రైతులు, వ్యాపారులు,యార్డ్ కార్మికులతో పండగ వాతావరణం కనిపిస్తుంది. మిర్చి ధర స్థిరంగా పెరుగుతూ ఉండటంతో మార్కెట్ కళ కళ లాడుతోంది. 

మరింత పెరగనున్న ధర..

ప్రస్థుతం విదేశాలకు మిర్చి ఎగుమతులకు సంబంధించి బ్యాన్ ఉంది. ఎక్స్ పోర్టుకు కేంద్రం పర్మిషన్ ఇస్తే  మిర్చి ధరలు మరింతగా పెరిగి అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు భారీగా రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget