By: Harish | Updated at : 06 Feb 2023 04:39 PM (IST)
ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
Guntur Hospital: సాధారణంగా ఆస్పత్రిలో సిబ్బందిగా ఎవరుంటారు ? ముందుగా డాక్టర్లు.. తర్వాత నర్సులు.. సపోర్టింగ్ స్టాఫ్.. అటెండర్లు, ఆయాలు..ఇలా చాలా మంది ఉంటారు. కానీ ఎలుకల్ని పట్టడానికి ప్రత్యేకంగా ఉద్యోగులుంటారా ?. ఇదేందయ్యా.. ఎప్పుడూ వినలేదే అనుకుటారేమో.. ఉంటారు. ఇది నిజం. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు.. అదే సాక్ష్యం. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎటు చూసినా ఎలుకలు కనిపిస్తూ ఉంటాయి. అవే ఎలుకలు పేషెంట్ల ప్రాణాలకు ముప్పుగా మారటంతో అదికారులు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు...
గతంలో ఎలుకలు కొరకడంతో ఆస్పత్రిలో పేషంట్ల మృతి
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు వ్యవహరం అంటే ఆషామాషీ కాదు.గతంలో జరిగిన సంఘటనలతో అధికారులు అప్రమత్తం అయ్యి,ఎలుకలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.దీంతో వారు ఎప్పటికప్పుడు ఎలుకలను పట్టుకుంటున్నారు. గతంలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎలుకలు కొరికేయటంతో వారు అపస్మారక స్దితిలోకి వెళ్లారు.అందులో ఒకరు చనిపోవటంతో ఘటన అందరిని కలచి వేసింది.ఈ వ్యవహరం పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రాజేశాయి.దీంతో అప్పటి నుండి గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు అంటేనే అందరికి భయంపట్టుకుంటుంది.
ఎలుకలు లేకుండా చేయడానికి ఐదేళ్ల కిందట ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహరం పై సీరియస్ గా వ్యవహరించారు.పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాసుపత్రి లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు.పెద్ద ఎత్తున పారిశుధ్య కార్మికులు ఇరవై నాలుగు గంటల పాటు నెల రోజులకు పైగా పని చేసి, ఆసుపత్రిలో చెత్తా చెదారాన్ని తొలగించారు. ఎలుకలు వచ్చే మార్గాలను పూర్తిగా గుర్తించి వాటిని తరిమికొట్టేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకున్నారు.ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేసింది. నష్టనివారణా చర్యల్లో భాగంగా ఇప్పటికి గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలను నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతూనే ఉంది.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం లు ఇప్పటికి అలర్ట్ గా ఉంటూ ఎలుకలను పట్టుకోవటమే పనిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేటికి పదుల సంఖ్యలో ఎలుకలు గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోన్ లలో చిక్కుకుంటున్నాయి.
ఆస్పత్రికి వచ్చే వారు ఆహారపదార్థాలు ఎలా పడితే అలా పడేయడంతోనే సమస్య
ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగులు,వారి బందువులు వస్తుంటారు.అలా వచ్చిన వారు తినుబండారాలను కూడ తీసుకురావటం పరిపాటి..అయితే వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయటంతో అవి ఎలుకలకు ఆహరంగా మారుతున్నాయి.ఒకే చోట ఆహరం పుష్కలంగా లభిస్తుండటంతో ఎలుకలు కూడ వందల సంఖ్యలో ఆసుపత్రిలో తిష్టవేశాయని అదికారులు భావిస్తున్నారు.5సంవత్సరాలుగా ఎలుకలు పై ప్రభుత్వ యంత్రాంగం నేటికి యుద్దం చేస్తూనేఉంది.
ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారారా, అధిష్టానం ఎలా స్పందిస్తుందో !
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్